పోస్టాఫీసులో డబ్బు దాచుకోవాలని ప్లాన్ చేస్తున్నారా..అయితే ఏప్రిల్ 1st నుంచి ఈ మార్పులు గమనించండి..

Published : Mar 31, 2023, 08:06 AM IST

పెట్టుబడి లేదా పొదుపు విషయానికి వస్తే, భారతీయులు ఇప్పటికీ పోస్టాఫీసు పథకాలను ఇష్టపడతారు. ఎందుకంటే పోస్టాఫీసు స్కీమ్‌లలో ఇన్వెస్ట్ చేసిన డబ్బు సురక్షితంగా ఉంటుందని భావిస్తారు. అలాగే మంచి రాబడి లభిస్తుంది. ఇటీవలి రోజుల్లో, ఆర్‌బిఐ రెపో రేటును భారీగా పెంచడంతో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్‌లపై వడ్డీ రేటు పెరిగింది. 

PREV
14
పోస్టాఫీసులో డబ్బు దాచుకోవాలని ప్లాన్ చేస్తున్నారా..అయితే ఏప్రిల్ 1st నుంచి ఈ మార్పులు గమనించండి..

పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు ఇటీవలి కాలంలో ప్రజాదరణ పొందుతున్నప్పటికీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న సమర్పించిన కేంద్ర బడ్జెట్‌లో కొన్ని ప్రసిద్ధ పోస్టాఫీసు పథకాలలో కొన్ని మార్పులను ప్రకటించారు. అందులో భాగంగా పోస్టాఫీసులోని కొన్ని ప్రముఖ పథకాలు ఏప్రిల్ 1 నుంచి మారనున్నాయి. కాబట్టి పోస్ట్ ఆఫీస్ ప్లాన్‌లన్నింటిలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో తెలుసుకుందాం. 

24

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS):  

యూనియన్ బడ్జెట్ 2023లో, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) పెట్టుబడి పరిమితిని రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షలు పెరిగింది. అంటే సీనియర్ సిటిజన్లు ప్రత్యేక SCSS ఖాతాలను తెరిచి ఒక్కో ఖాతాలో రూ.30 లక్షలు జమ చేయవచ్చు. పెట్టుబడి పెట్టవచ్చు. పెంపు ఏప్రిల్ 1, 2023 నుండి అమల్లోకి వస్తుంది. పదవీ విరమణ తర్వాత సీనియర్ సిటిజన్‌లకు నమ్మకమైన  సురక్షితమైన ఆదాయాన్ని అందించే లక్ష్యంతో ఈ ప్రభుత్వ-మద్దతు పథకం 2004లో ప్రారంభించబడింది. జనవరి-మార్చి త్రైమాసికంలో, SCS వడ్డీ రేటు 8%. 55 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్నవారు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. కనీసం రూ.1000 నుంచి ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి 5 ​​సంవత్సరాలు.పెట్టుబడిదారుడు కోరుకుంటే మరో మూడేళ్లపాటు పొడిగించుకోవచ్చు. 

34

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS):

యూనియన్ బడ్జెట్ 2023లో చేసిన ప్రకటన ప్రకారం, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS) పెట్టుబడి పరిమితిని రూ.4 లక్షల నుండి రూ.9 లక్షలకు పెంచారు. అలాగే జాయింట్ అకౌంట్ పెట్టుబడి పరిమితిని రూ.9 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచారు. ఈ పెంపు A.1 నుంచి అమల్లోకి రానుంది. POMIS పెట్టుబడిదారులు ప్రతి నెలా వడ్డీ డబ్బు పొందుతారు. ప్రస్తుతం జనవరి-మార్చి కాలానికి వడ్డీ రేటు 7.1%. MIS ఖాతా ఐదు సంవత్సరాల కాలవ్యవధిని కలిగి ఉంది. ఈ ఖాతా తెరిచిన మూడు సంవత్సరాల తర్వాత మూసివేయబడితే, 1% మొత్తం తీసివేయబడుతుంది.

44

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్‌ను ప్రకటించారు. ఇది మహిళా పెట్టుబడిదారుల కోసం రూపొందించిన పథకం. ఇది మార్చి 2025 వరకు రెండేళ్లపాటు అందుబాటులో ఉంటుంది. ఈ పథకం కింద స్త్రీ లేదా ఆడపిల్లల పేరిట ఒకేసారి 2 లక్షలు. పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పెట్టుబడిపై 7.5% వడ్డీ ఇస్తారు. ఈ వడ్డీ రేటు స్థిరంగా ఉంది  మారదు. మహిళల్లో పొదుపు అలవాట్లను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. 
 

click me!

Recommended Stories