ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో ఈ సర్వే జరిగింది. అన్ని కంపెనీల్లో కలిపి 1,70,000 మంది ఉద్యోగులను టైమ్స్, స్టాటిస్టా సంస్థలు వివరాలు అడిగాయి. పనిచేయడంలో ఇబ్బందులు, యాజమాన్య సంస్థ ఉద్యోగులకు కల్పిస్తున్న సదుపాయాలు, సాలరీలు, భద్రత తదితర విషయాలపై వివరాలు సేకరించారు. అంతే కాకుండా ఆయా సంస్థల రెవన్యూ గ్రోత్ ను కూడా పరిగణించాయి. ఇలా అనేక విషయాలను విశ్లేషించి ప్రపంచంలోనే టాప్ 1000 కంపెనీల లిస్టును విడుదల చేశాయి. అందులో అదానీ గ్రూప్స్ చోటు దక్కించుకున్నాయి.
అదానీ గ్రూప్స్ కాకుండా భారత దేశానికి చెందిన మరికొన్ని కంపెనీలు టైమ్స్ లిస్టులో చోటు దక్కించుకున్నాయి. వాటిల్లో హెచ్సీఎల్ టెక్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి మరో 22 కంపెనీలు ఉన్నాయి.