8వ జీతం కమిషన్ ఏర్పాటు ప్రతిపాదన పరిశీలనలో లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ గత నెలలో చెప్పిన కొన్ని రోజుల తర్వాత NC JCM కేంద్ర కేబినెట్ కార్యదర్శికి లేఖ రాసింది. వెంటనే కొత్త జీతం కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.
డిసెంబర్ 3న రాసిన లేఖలో 7వ జీతం కమిషన్ సిఫార్సులు అమలై తొమ్మిదేళ్లు అవుతోందని, తదుపరి జీతం, పింఛను సవరణ 2026 జనవరి 1 నుంచి అమలు కావాలని పేర్కొంది. ఈ విషయంపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూసి తదుపరి కార్యాచరణకు ఉద్యోగ సంఘాలు దిగుతాయని సమాచారం. ఏది ఏదైనా పింఛనుదారుల్లో మాత్రం ఆందోళన నెలకొంది.