దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (mahindra & mahindra) గ్రూప్ క్లాసిక్ లెజెండ్స్లో పెట్టుబడి పెట్టినప్పటి నుండి జావా మోటార్సైకిల్స్, బిఎస్ఎ అండ్ యెజ్డీ వంటి దిగ్గజ బ్రాండ్లు భారత మార్కెట్లోకి తిరిగి రావడంపై ఊహాగానాలు వ్యాపించాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో క్లాసిక్ లెజెండ్స్ భారతదేశంలో యెజ్డీ రోడ్కింగ్ కోసం ట్రేడ్మార్క్ దరఖాస్తు చేసింది. ఇది యెజ్డీ మోటార్సైకిళ్లను తిరిగి తీసుకురావడంపై ఊహాగానాలకు ఆజ్యం పోసింది.