అమరావతి: వైసిపి ప్రభుత్వం అమరావతి నుండి రాజధానిని తరలించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ ప్రాంత ప్రజలు, రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళన 300ల రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమరావతి ప్రాంతాల్లో పర్యటించి రాజధాని ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.
undefined
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ...''హింసించే 24వ రాజు జగన్ రెడ్డి. ఆయన మాట మార్చి, మడమ తిప్పి నేటికి 300 రోజులు అవుతోంది. అరెస్టులు, అవమానాలు, కేసులతోఇబ్బంది పడుతున్నా ఎత్తిన జెండా దించకుండా జై అమరావతి అంటున్న రైతులు, మహిళలు,యువత కి ఉద్యమ వందనాలు'' తెలిపారు లోకేష్.
undefined
''మనసున్న వాడికి రైతు కష్టం తెలుస్తుంది. మూర్ఖుడికి హింసించడం మాత్రమే తెలుస్తుంది.మనం మూర్ఖుడితో పోరాటం చేస్తున్నాం. ఇదొక సుదీర్ఘ పోరాటం. ఓర్పు, సహనంతో ఉంటే అంతిమ విజయం మనదే.పక్క రాష్ట్రానికి మూడు బస్సులు తిప్పలేని వాడు మూడు రాజధానులు కడతా అని బుస్సు మాటలు చెబుతున్నాడు'' అంటూ ఎద్దేవా చేశారు.
undefined
''రాజధాని కట్టాలంటే కనీసం 30 వేల ఎకరాలు ఉండాలని మాట మార్చింది ఎవరు? రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో రాజధాని ఉండాలని మడమ తిప్పింది ఎవరు?అమరావతి లోనే రాజధాని అందుకే ఇక్కడ ఇళ్ళు కట్టుకుంటున్నా అన్నది ఎవరు?''అంటూ సీఎం జగన్ ను లోకేష్ నిలదీశారు.
undefined
''రాజధాని కట్టాలంటే కనీసం 30 వేల ఎకరాలు ఉండాలని మాట మార్చింది ఎవరు? రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో రాజధాని ఉండాలని మడమ తిప్పింది ఎవరు?అమరావతి లోనే రాజధాని అందుకే ఇక్కడ ఇళ్ళు కట్టుకుంటున్నా అన్నది ఎవరు?''అంటూ సీఎం జగన్ ను లోకేష్ నిలదీశారు.
undefined