వదిలేదే లే... వారికి వడ్డీతో సహా తిరిగిస్తాం..: ధూళిపాళ్ళ సాక్షిగా లోకేష్ వార్నింగ్

First Published May 26, 2021, 11:27 AM IST

పాడి రైతులకు పాలపై రూ.4 ఎక్కువ ఇవ్వటం, ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్యం అందించటమే దూళిపాళ్ల చేసిన తప్పా? అసలు నరేంద్ర చేసిన తప్పేంటో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి'' అని లోకేష్ డిమాండ్ చేశారు. 

విజయవాడ: అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఇటీవలే అరెస్టయిన సంగం డెయిరీ చైర్మన్, టిడిపి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ మంగళవారం బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం విజయవాడలోని దూళిపాళ్ల ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఇంట్లోకి వెళుతూనే దూళిపాళ్లను ఆలింగనం చేసుకున్న లోకేష్ ఆయన కుటుంబసభ్యులను కూడా ఆత్మీయంగా పలకరించారు.
undefined
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... సీఎం జగన్ ను అమూల్ బేబీ అంటూ ఎద్దేవా చేశారు. పాడి రైతులకు పాలపై రూ.4 ఎక్కువ ఇవ్వటం, ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్యం అందించటమే దూళిపాళ్ల చేసిన తప్పా. నరేంద్ర చేసిన తప్పేంటో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి'' అని లోకేష్ డిమాండ్ చేశారు.
undefined
''దశాబ్దాల నుంచి రైతు ప్రయోజనాల కోసం పనిచేస్తున్న సంగం డెయిరీ పై కక్ష సాధింపు దుర్మార్గం. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ జగన్ రెడ్డి చేసిన కుట్రను స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా నరేంద్ర బయటపెట్టారు. అందువల్లే ఆయనను జగన్ టార్గెట్ చేశారు'' అన్నారు.
undefined
''అమూల్ డైయిరీ కోసం ప్రజా ధనం ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో డైయిరీలన్నీ గుజరాత్ కు కట్టబెట్టే యత్నం చేస్తున్నారు. అమూల్ డెయిరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్లు ప్రజాధనం వృధా చేస్తుంది. అసలు, వడ్డీ కలిపి ఏడాదికి 500 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. రాష్ట్ర ఆస్తులను గుజరాత్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోంది'' అని ఆందోళన వ్యక్తం చేశారు.
undefined
''ప్రజలు చనిపోతుంటే పట్టించుకోని దద్దమ్మ జగన్ రెడ్డి కక్ష సాధింపులకు ప్రాధాన్యం ఇచ్చారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు జగన్మోహన్ రెడ్డి పెట్టిన అక్రమ కేసుల లిస్టు చాలా పెద్దది. జగన్ రెడ్డి ఓ శాడిస్టు రెడ్డి. ప్రజల పక్షాన పోరాడే సొంత ఎంపీని కొట్టించిన శాడిస్టు. లక్ష కోట్లు దోపిడీ చేసి జైలుకెళ్లిన జగన్ రెడ్డి కక్షతో తెలుగుదేశం నేతల్ని జైలుకు పంపుతున్నారు'' అని మండిపడ్డారు.
undefined
''కొందరు అధికారులు చట్టాల్ని ఉల్లంఘించి పని చేస్తున్నారు. వారికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసే ఏ ఒక్కరిని వదిలిపెట్టం'' అని లోకేష్ హెచ్చరించారు.
undefined
''మనస్సాక్షి గా నేను ఏనాడూ తప్పు చేయలేదు. వేల కోట్లు దోపిడీ చేశానని ఆరోపణలు చేసి... ఆఖరికి రైతుల్ని పరామర్శించడానికి వెళితే ట్రాక్టర్ రాష్ డ్రైవింగ్ కేసు నాపై పెట్టారు. పోలీసుల్ని అడ్డంపెట్టుకుని భయపడుతూ బతికేది మంత్రులే. సామాజిక మాధ్యమాల్లో పోస్టులకు కూడా భయపడి కేసులు పెడుతున్నారు. ఇప్పటికైనా కక్షసాధింపు పక్కన పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలి'' అని సీఎం జగన్ కు సూచించారు నారా లోకేష్.
undefined
click me!