తాడేపల్లి : ఎన్డిఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటనకు విచ్చేసారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకన్న ఆమెకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు సాదరస్వాగతం పలికారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అర్చకులు ద్రౌపది ముర్ముకు ఆశిర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందించారు. అలాగే సీఎం జగన్ కూడా జ్ఞాపిక అందజేసారు.