చంద్రబాబునే కాదు, జగన్ ను నచ్చని ఓటర్లు: నోటాకు ఓట్లు

First Published May 28, 2019, 10:58 AM IST

 తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే కాదు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కొంత మంది ఓటర్లకు నచ్చలేదు. చంద్రబాబు పోటీ చేసిన కుప్పంలోనూ జగన్ పోటీ చేసిన పులివెందుల నియోజకవర్గంలోనూ నోటాకు ఓట్లు పడ్డాయి. 

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే కాదు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కొంత మంది ఓటర్లకు నచ్చలేదు. చంద్రబాబు పోటీ చేసిన కుప్పంలోనూ జగన్ పోటీ చేసిన పులివెందుల నియోజకవర్గంలోనూ నోటాకు ఓట్లు పడ్డాయి. (
undefined
చంద్రబాబు పోటీ చేసిన చిత్తురూ జిల్లా కుప్పం నియోజకవర్గంలో నోటాకు పెద్ద యెత్తున 2,905 ఓట్లు పోలయ్యాయి. చంద్రబాబు లక్షకుపైగా ఓట్ల వచ్చాయి. ఆయనకు 30,772 ఓట్ల మెజారిటీ వచ్చింది. 1989 నుంచి చంద్రబాబు కుప్పం నుంచి విజయం సాధించడం ఇది ఏడోసారి.
undefined
జగన్మోహన్ రెడ్డి పోటీ చేసిన కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో నోటాకు 2,160 ఓట్లు వచ్చాయి. వైఎస్ జగన్మో హన్ రెడ్డికి 1,32,356 ఓట్లు పోలయ్యాయి. ఆయన 90,110 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.
undefined
చంద్రబాబు నాయుడు ఆశ్చర్యకరంగా కొద్దిసేపు తన ప్రత్యర్థి చంద్రమౌళి కన్నా వెనుకంజలో ఉన్నారు. చివరకు 30,772 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఆయన ఆధిక్యత 2014తో పోల్చుకుంటే 47,121 నుంచి 30,772 ఓట్లకు పడిపోయింది. (
undefined
click me!