సైలెంట్ గా పెళ్లి చేసుకున్న తెలుగు సినీ రైటర్

By Surya PrakashFirst Published Jul 30, 2020, 6:49 PM IST
Highlights

నిన్న రాత్రి 8.45ని.లకి మచిలీపట్నంలోని రెవిన్యూ మండపంలో సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే తదితర చిత్రాలకి రచయితగా పని చేసిన ప్రసన్న కుమార్ వివాహం చేసుకున్నారు. కొద్ది మంది బంధువుల సమక్షంలోనే వివాహ వేడుక జరగగా, ఇండస్ట్రీకి సంబంధించి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు.
 

కరోనా కాలంలో సినీ ప్రముఖులు వరస పెట్టి పెళ్ళిళ్లు చేసుకుంటున్నారు. రీసెంట్ గా  నితిన్ త‌న ప్రేయ‌సిని వివాహ‌మాడ‌గా, ఆగ‌స్ట్ నెల‌లో రానా -మిహీకాల వివాహం జ‌ర‌గ‌నుంది. అలాగే సాహో డైరెక్టర్  సుజీత్ కూడా త్వరలోనే పెళ్లి చేసుకోనున్నాడు.  ఈ మేరరు ఎంగేజ్మెంట్ సైతం జరిగింది. 

తాజాగా నిన్న రాత్రి 8.45ని.లకి మచిలీపట్నంలోని రెవిన్యూ మండపంలో సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే తదితర చిత్రాలకి రచయితగా పని చేసిన ప్రసన్న కుమార్ వివాహం చేసుకున్నారు. కొద్ది మంది బంధువుల సమక్షంలోనే వివాహ వేడుక జరగగా, ఇండస్ట్రీకి సంబంధించి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు.

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన  గుర్తింపు తెచ్చుకున్న రైటర్ బెజవాడ ప్రసన్నకుమార్. "నేను లోకల్", "సినిమా చూపిస్త మామ" లాంటి సినిమాలతో హిట్స్ అందుకున్న  రైటర్ ప్రసన్నకుమార్ ఓ ఇంటివాడటంతో ఇండస్ట్రీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.  లాక్ డౌన్ నిబంధనల వల్ల ఈ పెళ్లి సింపుల్ గా, సైలెంట్ గా అలా జరిగింది.

ఇక ఈ వివాహం.. పెద్దలు కుదిర్చినదే. ప్రసన్నకుమార్ భార్య పేరు మౌనిక. ఈ పెళ్లికి దర్శకుడు త్రినాథరావు నక్కిన, హీరో అశ్విన్ బాబు హాజరయ్యారు. వీళ్లతో పాటు జబర్దస్త్ బ్యాచ్ హైపర్ ఆది, అవినాష్, రామ్ ప్రసాద్ కూడా ఈ పెళ్లికి హాజరైన వాళ్లలో ఉన్నారు.

ప్రస్తుతం రవితేజ కొత్త సినిమాపై వర్క్ చేస్తున్నాడు ప్రసన్నకుమార్. త్వరలోనే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. మరోవైపు వాలీబాల్ ప్లేయర్ అరికపూడి రమణారావు జీవితచరిత్ర ఆధారంగా కూడా ఓ స్టోరీ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు.

click me!