అతిథులా... ఆట బొమ్మలా?

By team teluguFirst Published Dec 9, 2020, 5:14 PM IST
Highlights

మెగా ఫ్యామిలీతో అంతగా అనుబంధం లేని, రీతూ వర్మ, లావణ్య త్రిపాఠి రావడం జరిగింది. స్టార్ హీరోలతో పాటు, మెగా హీరోలతో పలు సినిమాలలో నటించిన స్టార్ హీరోయిన్స్ కూడా హాజరుకాని ఈ వివాహ వేడుకలో రీతూ, లావణ్య సందడి చేయడం ఏమిటో అర్థం కావడం లేదు. 

మరి కాసేపట్లో నిహారిక-చైతన్య పెళ్లిపీటలు ఎక్కనున్నారు. నేడు రాత్రి 7:00 గంటలకు ఉదయ్ పూర్ ప్యాలస్ లో వీరి వివాహం ఘనంగా జరగనుంది. ఇక మూడు రోజులుగా మెగా ఫ్యామిలీ మొత్తం ఉదయ్ పూర్ ప్యాలస్ లో విడిది చేశారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలైన సంగీత్ మరియు ఇతర కార్యక్రమాలలో సరదాగా గడుపుతున్నారు. చిరంజీవితో పాటు చరణ్, అల్లు అర్జున్, ధరమ్ తేజ్ మరియు వరుణ్ కొత్త జంటతో సందడి చేశారు. 
 
ఇక నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ కూడా ఉదయ్ పూర్ చేరుకున్నారు. తన కొడుకు అకీరాతో పాటు ఈ వేడుకకు హాజరు కావడం విశేషం. కాగా ఈ వేడుకలో టాలీవుడ్ కి చెందిన ఇద్దరు హీరోయిన్స్ హాజరు కావడం ఆసక్తి రేపుతుంది. మెగా ఫ్యామిలీతో అంతగా అనుబంధం లేని, రీతూ వర్మ, లావణ్య త్రిపాఠి రావడం జరిగింది. స్టార్ హీరోలతో పాటు, మెగా హీరోలతో పలు సినిమాలలో నటించిన స్టార్ హీరోయిన్స్ కూడా హాజరుకాని ఈ వివాహ వేడుకలో రీతూ, లావణ్య సందడి చేయడం ఏమిటో అర్థం కావడం లేదు. 
 
ఒకవేళ స్పెషల్ ఈవెంట్స్ లో పెళ్లికి వచ్చిన అతిథులను తమ డాన్స్ షోలతో అలరించడానికి లావణ్య, రీతూ రెమ్యూనరేషన్ కోసం వచ్చారేమో అనిపిస్తుంది. కారణం ఏదైనా స్టార్స్ కూడా కనబడని ఈవెంట్ లో రీతూ వర్మ, లావణ్య త్రిపాఠి తళుక్కున మెరిశారు. మెగా కుటుంబంలో చాలా కాలం తరువాత జరుగుతున్న ఈ వేడుక స్టేటస్ కి తగ్గట్టుగా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఉదయ్ పూర్ ప్యాలస్ లో మూడు రోజుల వివాహ ఖర్చే దాదాపు 60లక్షలు అని సమాచారం అందుతుంది. 
click me!