ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబులకు పోటీ ఇవ్వడం కోసం చిరు చేసిన పనేంటో తెలుసా?

Published : May 01, 2025, 05:47 PM IST
ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబులకు పోటీ ఇవ్వడం కోసం చిరు చేసిన పనేంటో తెలుసా?

సారాంశం

Chiranjeevi: చిరంజీవి వేవ్‌ సమ్మిట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబులకు దీటుగా రాణించడం కోసం ఆయన ప్రత్యేకంగా ఏం చేశాడో బయటపెట్టారు. తాజాగా ఆయన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.   

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి వేవ్‌ సమ్మిట్‌(వరల్డ్ ఆడియో విజువల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌ 2025)లో పాల్గొన్నారు. ముంబయిలోని జీయో వరల్డ్ కన్వెన్షన్‌ సెంటర్‌లో మే 1న గురువారం జరిగిన ఈ ఈవెంట్‌లో ఇండియన్‌ ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల నుంచి వివిధ దిగ్గజాలు హాజరయ్యారు. చిరంజీవి, అక్షయ్‌ కుమార్‌, మిథున్‌ చక్రవర్తి, రజనీకాంత్‌, మోహన్‌లాల్‌, అలియాభట్‌, రణ్‌ బీర్‌ కపూర్‌, ఇలా చాలా మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సమ్మిట్‌ని ప్రధాని మోడి ప్రారంభించారు. 

ఈ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఆయన మాట్లాడుతూ, తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. బాల్యంలో తాను ఎక్కువగా డ్యాన్సులు చేసి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌ను ఎంటర్టైన్ చేస్తుండేవాడినని తెలిపారు. అలా నటనపై తనకు ఆసక్తి ఏర్పడిందన్నారు చిరు. చివరకు మద్రాసుకి వెళ్లి ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్‌లో జాయిన్ అయిన చిరు, అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్నార్ , కృష్ణ, శోభన్ బాబు  ఇలా అర డజనుకు పైగా స్టార్ హీరోలున్నారని, అలాంటి వారి మధ్య నాకు అసలు అవకాశం వస్తుందా? అని అనుకున్నారట. 

`అందరి కంటే భిన్నంగా ఏం చేయగలను అని ఆలోచించాను. అప్పుడే ఫైట్స్, డ్యాన్స్ విషయంలో మరింత శిక్షణ తీసుకున్నాను. అవే ఇప్పుడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. మేకప్ లేకుండా సహజంగా నటించడం మిథున్ చక్రవర్తి , స్టంట్స్ విషయంలో అమితాబ్, డ్యాన్స్ విషయంలో నా సీనియర్ కమల్ హాసన్ నాకు స్పూర్తిగా నిలిచారు. అందరినీ చూస్తూ, పరిశీలిస్తూ నన్ను నేను మల్చుకుంటూ ఈ స్థాయికి వచ్చానని తెలిపారు చిరంజీవి.  

చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన `విశ్వంభర` చిత్రంలో బిజీగా ఉన్నారు. సోషియో ఫాంటసీగా ఇది తెరకెక్కుతుంది. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. వీఎఫ్‌ఎక్స్ ఆలస్యం కారణంగా రిలీజ్‌ డిలే అవుతుంది. సెప్టెంబర్‌లో ఈ మూవీని విడుదల చేసే అవకాశం ఉంది. దీంతోపాటు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు చిరు. ఇటీవలే ఈ చిత్రం ప్రారంభమైంది. దీంతోపాటు శ్రీకాంత్‌ ఓడెల దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నారు మెగాస్టార్‌.  
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bhanupriya: ఎవరితో కలవదు, ఫ్రెండ్స్ కూడా లేరు, భానుప్రియపై ఖుష్బూ సంచలన కామెంట్స్
Box Office: తొలిరోజే 100 కోట్ల ఓపెనింగ్స్ సాధించగలిగే ఐదుగురు హీరోలు.. టాప్‌లో ఎవరు?