వేదికపైనే నటుడు విశాల్ స్పృహ కోల్పోయిన సంఘటన ఫ్యాన్స్ కి ఆందోళన కలిగించింది. విల్లుపురంలో జరిగిన మిస్ ట్రాన్స్జెండర్ అందాల పోటీ కార్యక్రమానికి విశాల్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. మిస్ ట్రాన్స్జెండర్ అందాల పోటీ విల్లుపురం కొత్త బస్టాండ్ సమీపంలోని మున్సిపల్ మైదానంలో జరిగింది.
ఈ ఈవెంట్ లో విశాల్ ఒక్కసారిగా స్పృహ కోల్పోయి పడిపోయారు. దీనితో అక్కడున్న వారంతా ఆందోళన చెందారు. అదే ఈవెంట్ కి మాజీ మంత్రి పొన్నుడి కూడా అతిథిగా హాజరయ్యారు. విశాల్ స్పృహ కోల్పోయిన వెంటనే పొన్నుడి.. తన కారులో విశాల్ ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స తర్వాత విశాల్ కోలుకున్నట్లు తెలుస్తోంది. అయితే విశాల్ ఎందుకు స్పృహ కోల్పోయారు ? విశాల్ ఆరోగ్యానికి ఏమైంది ? అనే అనుమానాలు మాత్రం ఫ్యాన్స్ లో ఉన్నాయి.
తాజాగా విశాల్ ఆరోగ్యం పై అతడి మేనేజర్ హరి క్లారిటీ ఇచ్చారు. విశాల్ కి ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని.. కాకపోతే మధ్యాహ్నం ఆయన ఆహారం తీసుకోకుండా కేవలం జ్యూస్ మాత్రమే తాగారని తెలిపారు. అందువల్లే నీరసం వచ్చి స్పృహ కోల్పోయినట్లు హరి క్లారిటీ ఇచ్చారు.
వైద్యులు అందించిన చికిత్స తర్వాత విశాల్ ఆరోగ్యంగా ఉన్నారు. ఇకపై ఆహారం తీసుకోవడం మానవద్దని వైద్యులు విశాల్ కి సూచించారు. ప్రస్తుతం విశాల్ ఆరోగ్యంగా ఉన్నారు. ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని హరి తెలిపారు.
ఏడాది జనవరిలో కూడా విశాల్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విశాల్ వేదికపై వణుకుతూ నడవలేని స్థితిలో కనిపించారు. బాగా బరువు కోల్పోయారు. వైరల్ ఫీవర్ వల్లే విశాల్ అలా అయ్యారని తెలిసింది. ఆ తర్వాత విశాల్ తిరిగి కోలుకున్నారు.