వెంకీ ‘దృశ్యం-2’ రిలీజ్ డేట్ ఖరారు

By Surya PrakashFirst Published Sep 12, 2021, 12:45 PM IST
Highlights


రీసెంట్ గా వెంకీ నటించిన ‘నారప్ప’ఓటీటిలో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఆయన నటించిన మరో చిత్రం రిలీజ్ కు రెడీ అయ్యింది. వెంకటేష్‌, మీనా జంటగా గతంలో వచ్చిన మలయాళీ రీమేక్‌ చిత్రం ‘దృశ్యం’ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే.  

మోహన్‌లాల్‌-మీనా జంటగా నటించిన మలయాళీ చిత్రం ‘దృశ్యం-2’. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ వేదికగా విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేసి ,విడుదలకు రంగం సిద్ధం చేసారు. వెంకటేశ్‌-మీనా జంటగా రానున్న ఈ చిత్రానికి  మొదటి భాగానికి శ్రీప్రియ దర్శకత్వం వహించగా ప్రస్తుత సీక్వెల్‌కు మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్‌ మెగాఫోన్‌ పట్టుకున్నారు.   కొవిడ్‌ ప్రభావం తగ్గని కారణంగా పరిమిత సిబ్బందితోనే షూటింగ్ చేసారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

మొన్నటిదాకా ఈ చిత్రం ఓటీటిలో రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగింది.  అయితే దృశ్యం 2ను ఓటీటీలో రిలీజ్‌ చేయాలని భావించినా నిర్మాత సురేశ్‌ బాబు వాటిని ఖండించారు. అయితే తాజాగా థియోటర్స్ లో  సినిమాల విడుదలకు ఆలస్యం అవుతుండటంతో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఇప్పుడు ఈ చిత్రాన్ని థియోటర్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. అందుతున్న  సమాచారం ప్రకారం దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల ప్లాన్ చేస్తున్నారు. తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.

మరో ప్రక్క  ప్రముఖ నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్‌ ‘దృశ్యం 2’ హిందీ రీమేక్‌ హక్కులు సొంతం చేసుకుంది.   అనుకోకుండా చిక్కుకున్న ఓ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కూతురిని ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడు అనే కథాంశంతో రూపొందించిన రూపొందిన సినిమానే దృశ్యం-2.  
 

click me!