అల్లు అర్జున్, ప్రభాస్ పై క్రేజీ డైరెక్టర్ ఫోకస్.. అయ్యే పనేనా ?

By Asianet NewsFirst Published Feb 7, 2023, 7:36 AM IST
Highlights

సెన్సిబుల్ చిత్రాలకు కాస్త యాక్షన్ జోడించి తెరకెక్కించడం లో దర్శకుడు వంశీ పైడిపల్లి సిద్ధహస్తుడు. చివరగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన వారసుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.

సెన్సిబుల్ చిత్రాలకు కాస్త యాక్షన్ జోడించి తెరకెక్కించడం లో దర్శకుడు వంశీ పైడిపల్లి సిద్ధహస్తుడు. చివరగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన వారసుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. కానీ వంశీ పైడిపల్లి దర్శకత్వం గురించి కొన్ని కామెంట్స్ వినిపించాయి. విజయ్ స్టార్ పవర్, సంక్రాంతి సీజన్ వల్ల ఈ చిత్రం గట్టెక్కింది అనే ప్రచారం జరిగింది. 

వంశీ పైడిపల్లి దర్శకుడిగా కొత్తదనం చూపించలేకపోయారు. సూపర్ స్టార్ మహేష్ బాబు రిజెక్ట్ చేసిన కథతో పైడిపల్లి వారసుడు చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదిలా ఉండగా వంశీ పైడిపల్లి తదుపరి చిత్రం ఏంటి అనే ఊహాగానాలు మొదలయ్యాయి. వారసుడు చిత్రం సాలిడ్ హిట్ ఏమీ కాలేదు. ఈ తరుణంలో వంశీకి స్టార్ హీరోలు డేట్స్ ఇవ్వడం కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

ప్రస్తుతం వంశీ తన నెక్స్ట్ మూవీ కోసం అల్లు అర్జున్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది. అలాగే ప్రభాస్ కి కథ వినిపించేందుకు కూడా వంశీ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. 

ప్రభాస్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ఈ తరుణంలో వంశీ పైడిపల్లి వారికి కథ వినిపించి ఒప్పించడం కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వంశి ఆల్రెడీ ప్రభాస్ ని మున్నా చిత్రంతో డైరెక్ట్ చేసాడు. రాంచరణ్ ఎవడు చిత్రంలో బన్నీ గెస్ట్ రోల్ లో నటించాడు. 

వంశీ పైడిపల్లి కెరీర్ లో ఎవడు , ఊపిరి, మహర్షి లాంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. వంశీ ఈసారి కూడా స్టార్ హీరోలు అవకాశం ఇస్తారో లేక.. ఈ దర్శకుడు విభిన్న ప్రయోగం చేస్తాడో వేచి చూడాలి. 

click me!