
‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ‘వేర్ ఈజ్ ద పార్టీ... బాసూ వేర్ ఈజ్ ద పార్టీ’ అంటూ మెగాస్టార్ తో హుషారుగా స్టెప్పులు వేసిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా తెలుగులో ఓ రేంజిలో పేరు తెచ్చుకుంది. యూత్ లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ పాట సూపర్ హిట్ అవ్వడంతో ఊర్వశికి టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. స్పెషల్ సాంగ్స్ కోసం దర్శకులు ఆమె వైపే చూస్తున్నారు. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘ఏజెంట్’ చిత్రంలో దర్శకుడు సురేందర్ రెడ్డి ఓ ప్రత్యేక పాట తెరకెక్కించాడు. ఇందులో అఖిల్ తో కలిసి ఊర్వశి కాలు కదిపింది. ఇది మాస్ ట్యూన్ లో వచ్చే జానపద గేయం అని తెలుస్తోంది.
అయితే ఈ పాట పూర్తైంది, సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇదిలా ఉంటే తనను తాను స్వయం ప్రకటిత రివ్యూ రైటర్ గా, విశ్లేషకుడుగా చెప్పుకునే ఉమర్ సింధూ చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. అఖిల్ అక్కినేని ..ఏజెంట్ చిత్రం యూరోప్ షూటింగ్ లో ఉండగా ఊర్వశీ రౌతాలా ని హెరాస్ చేసాడని, అతను ఇమెట్యూర్ ఏక్టర్ అని, అతనితో పనిచేయటం కంపర్ట్ గా లేదని ఆమె ఫీలవుతున్నట్లుగా ట్వీట్ చేసాడు.
అయితే ఈ ట్వీట్ ని ఆమె ఖండిస్తూ ..లీగల్ నోటిస్ పంపింది. ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న అతనిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుని లీగల్ నోటీస్ పంపినట్లు ఆమె ఇనిస్ట్రాలో రాసుకొచ్చింది. అయితే ఆ పోస్ట్ లో ఆమె అతని ప్రస్తావన చేయలేదు.
ఇక ఈ పాటని భారీ స్థాయిలో తెరకెక్కించారని సమాచారం. కాగా, అఖిల్ కెరీర్ లోనే అత్యధికంగా రూ.70 కోట్లు ఖర్చుపెట్టిన ఈ చిత్రం ఈనెల 28న ‘ఏజెంట్’ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషించారు. ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ సినిమాపై అఖిల్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందించాడు.