రాంచరణ్ డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడా ?.. అందంపై విమర్శలు, తొలిసారి ఓపెన్ అయిన ఉపాసన

By Asianet NewsFirst Published Apr 2, 2023, 3:04 PM IST
Highlights

రాంచరణ్ కి పర్సనల్ లైఫ్ లో కూడా ఈ ఏడాది ఎంతో మెమొరబుల్ కానుంది. రాంచరణ్ సతీమణి ఉపాసన ప్రస్తుతం గర్భవతి అయిన సంగతి తెలిసిందే.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ గ్లోబల్ స్టార్ గా ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించడం, నాటు నాటు సాంగ్ ఆస్కార్ సాధించడంతో చరణ్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ.. ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. హాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేసేందుకు కూడా చరణ్ చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఇదిలా ఉండగా రాంచరణ్ కి పర్సనల్ లైఫ్ లో కూడా ఈ ఏడాది ఎంతో మెమొరబుల్ కానుంది. రాంచరణ్ సతీమణి ఉపాసన ప్రస్తుతం గర్భవతి అయిన సంగతి తెలిసిందే. చరణ్, ఉపాసనకి పుట్టబోయే బిడ్డ కోసం మెగా ఫ్యామిలీ తో పాటు అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. 

రాంచరణ్, ఉపాసన దంపతులకు పెళ్ళై పదేళ్లు గడుస్తోంది. దీనితో ఇప్పటి వరకు వీరికి పిల్లలు పుట్టడం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. అదే విధంగా రాంచరణ్, ఉపాసనకి పెళ్లైనప్పుడు అనేక విమర్శలు వినిపించాయి. ఉపాసన అపోలో సంస్థల అధినేత ప్రతాప్ రెడ్డికి మనవరాలు.. కోట్ల ఆస్తికి వారసురాలు. 

దీనితో చరణ్ డబ్బు కోసమే ఉపాసనని పెళ్లి చేసుకున్నాడు అంటూ అప్పట్లో కామెంట్స్ చేశారు. ఉపాసన లుక్స్, అందంపై కూడా కామెంట్స్ చేస్తూ ఆమెని జడ్జ్ చేశారు. వీటన్నింటిపై ఉపాసన తొలిసారి పెదవి విప్పింది. ఓ ఇంటర్వ్యూలో ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

రాంచరణ్, నేను కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకున్నాం. మొదట స్నేహం ఆ తర్వాత ప్రేమ చిగురించింది. మా ఇద్దరికి ఒకరిపై ఒకరికి నమ్మకం గౌరవం ఉన్నాయి. అదే మా బంధాన్ని మరింత పెంచింది. మా ఇద్దరి కుటుంబ నేపథ్యాలు వేరు. చిన్నప్పటి నుంచి నన్ను ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో జడ్జ్ చేస్తూనే ఉన్నారు. మెచ్యూరిటీ వచ్చాక నా ఆలోచనలో కూడా మార్పు వచ్చింది. సమాజంలో ఇలాంటి విమర్శలు ప్రతి ఒక్కరికి సహజమే అని అర్థం చేసుకున్నా. 

పెళ్ళైన కొత్తల్లో నన్ను బాడీ షేమింగ్ చేస్తూ ట్రోలింగ్ చేశారు. అందంగా లేనని అన్నారు. డబ్బు కోసమే చరణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడనే కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ ఆ విమర్శలకు నేనెప్పుడూ కుంగిపోలేదు. ఇప్పుడు నన్ను విమర్శించిన వారే ప్రశంసిస్తున్నారు అని ఉపాసన పేర్కొంది. 

click me!