గుంపులో నిలిపేశారు... ఇద్దరు హీరోయిన్స్ కి చేదు అనుభవం!

By Sambi ReddyFirst Published Sep 28, 2022, 3:58 PM IST
Highlights

సెలెబ్రిటీలు పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.  సెక్యూరిటీ ఏమాత్రం విఫలం చెందినా జనాల్లో నలిగిపోవడం ఖాయం. ఇలాంటి చేదు అనుభవాన్ని ఇద్దరు హీరోయిన్స్ ఫేస్ చేశారు. 
 

మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు హీరోయిన్స్ తమ లేటెస్ట్ మూవీ ప్రమోషన్స్ కోసం కాలికట్ నగరంలోని ఓ మాల్ కి వెళ్లారు. హీరోయిన్స్ వస్తున్నారని తెలిసి మాల్ జనాలతో కిక్కిరిసిపోయింది. ప్రమోషనల్ ఈవెంట్ ముగించుకొని వెళ్లే క్రమంలో ఆ ఇద్దరు హీరోయిన్స్ జనాల్లో చిక్కుకుపోయారు. క్రౌడ్ ని సెక్యూరీటీ నియంత్రించ లేకపోయారు. దీంతో గుంపులో ఉన్న పోకిరీలు హీరోయిన్స్ ని తాకుతూ మిస్ బిహేవ్ చేశారు. 

ఈ విషయాన్ని ఇద్దరిలో ఓ హీరోయిన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఆమె సుదీర్ఘ సందేశం పంచుకున్నారు. మేము మా కొత్త మూవీ ప్రమోషన్స్ ఓ మాల్ లో నిర్వహిస్తున్నాము. ఆ మాల్ జనాలతో కిక్కిరిసిపోయింది. ప్రొమోషన్స్ ముగిశాక అక్కడికి నుండి బయటికి వెళ్లే ప్రయత్నం చేశాము. పొరపాటున ఆ గుంపులో మేము చిక్కుకుపోయాము. సెక్యూరిటీ కూడా సహాయం చేయలేని పరిస్థితి. నా సహనటిని తాకుతూ గుంపులో ఉన్న ఓ వ్యక్తి మిస్ బిహేవ్ చేశాడు. 

అలా చేసినవాడు ఎవరో కూడా గుర్తించలేని పరిస్థితి నెలకొంది. కాసేపటి తర్వాత నాకు కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. నేను వెంటనే రియాక్ట్ అయ్యాను. ఒకరిని చెంపఫై కొట్టబోయాను. ఇలాంటి భయానక పరిస్థితులు మరో అమ్మాయికి ఎదురు కాకూడదు. అలాగే అమ్మాయిల పట్ల తప్పుగా ప్రవర్తించిన వారికి శిక్ష పడాలి... అని తన సందేశంలో సదరు నటి పొందుపరిచారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వీడియోలు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.  

click me!