Radhe Shyam: 'రాధే శ్యామ్'ని ఇలా కూడా వాడొచ్చా.. సజ్జనార్ ట్వీట్ వైరల్

By team teluguFirst Published Mar 11, 2022, 5:44 AM IST
Highlights

ఆర్టీసీ ప్రయాణమే సురక్షితం అంటూ ప్రభాస్ రాధే శ్యామ్ మూవీ పోస్టర్ తో ఉన్న మీమ్ ని సజ్జనార్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. 
 

ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  రాధే శ్యామ్ మూవీ థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ప్రేమ కథ. ఈ చిత్రంలో ప్రభాస్ పామ్ ఆర్టిస్ట్ ( హస్తసాముద్రిక నిపుణుడు) గా నటిస్తున్నాడు. నేడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొని ఉంది. 

రాధే శ్యామ్ క్రేజ్ ని ఆర్టీసీ ఎండి సజ్జనార్ వాడేసుకుంటున్నారు. ప్రభాస్ చిత్రాన్ని ఇలా కూడా వాడుకోవచ్చా అంటూ సజ్జనార్ ట్వీట్ పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ ఆ సంస్థని మరింత అభివృద్ధి చేసేందుకు సజ్జనార్ చాలా కృషి చేస్తున్నారు. సోషల్ మీడియాని ఉపయోగించుకుని ఆర్టీసీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. 

Latest Videos

ఏదైనా క్రేజీ మూవీ రిలీజవుతున్నప్పుడు దానిని ఉపయోగించుకుని ఆర్టీసీకి పబ్లిసిటీ క్రియేట్ అయ్యేలా ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ బస్సులోనే జర్నీ సురక్షితం అని తెలియజెప్పేలా రాధే శ్యామ్ పోస్టర్ తో ఉన్న మీమ్ ని సజ్జనార్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటోంది. 

ఈ మీమ్ లో ప్రభాస్ పూజా హెగ్డే ఆర్టీసీ గురించి మాట్లాడుకుంటున్నట్లు ఉంది. చాలా రోజుల తర్వాత కలిశాం.. ఎటైనా టూర్ వెళదామా అని ప్రభాస్ అడగగా.. వెళదాం కానీ ఆర్టీసీ బస్సులోనే వెళదాం.. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అంటూ పూజా హెగ్డే ప్రభాస్ కి చెబుతుంది. 

దీనితో సజ్జనార్ వాడకం మాములుగా లేదుగా అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. రాధే శ్యామ్ చిత్రం ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కింది. రాధా కృష్ణ ఈ చిత్రానికి దర్శకులు. కృష్ణం రాజు, జగపతి బాబు, సత్యరాజ్, సచిన్ ఖేడ్కర్, సీనియర్ నటి భాగ్య శ్రీ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. 

బస్సులోనే వెళ్దాం అంటున్నా Choose TSRTC & Encourage the pic.twitter.com/3QuEsYqN9i

— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice)
click me!