సీనియర్ డైరెక్టర్ సాగర్ కన్నుమూత, దిగ్భ్రాంతిలో టాలీవుడ్..

By Mahesh JujjuriFirst Published Feb 2, 2023, 9:12 AM IST
Highlights

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ సాగర్ కన్ను మూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ట్రీట్ మెంట్ తీసుకుంటూ కన్నుమూశారు. 

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ సాగర్ కన్ను మూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ట్రీట్ మెంట్ తీసుకుంటూ కన్నుమూశారు. 

టాలీవుడ్ ను వరుస విషాదాలు ముంచెత్తుతున్నాయి. పోయిన ఏడాది వరుసగా సీనియర్ తారలు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఇక ఈ ఏడాది ఆరంభంలోనే సీనియర్ నటి జమున కన్నుమూశారు. ఈ షాక్ నుంచి తేరుకోకముందే..మరో తార ఆకాశాన్ని చేరింది. సీనియర్ డైరక్టర్ సాగర్ కన్ను మూశారు. అనారోగ్య కారణంతో ఈరోజు ఉదయం 5 గంటల 30 నిమిషాకు సాగర్ కన్ను మూసినట్టు ఆయన తనయుడు వెల్లడించారు. 

గత కొద్ది కాలంగా లివర్ సమస్యతో బాధపడుతున్నారు సాగర్. చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. చికిత్స తీసుకుంటూ బాగానే ఉన్నారు సాగర్. కాని సడెన్ గా పరిస్థితి విషమించడంతో.. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఆయన మరణించారు. టాలీవుడ్ లో వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలు తెరకెక్కించారు సాగర్. దాదాపు 30 సినిమాల వరకూ తెరకెక్కించారు సాగర్. సూపర్ స్టార్ కృష్ణ, సుమన్, భాను చందర్, సాయి కుమార్ లాంటి  హీరోలతో సూపర్ హిట్ సినిమాలు అందించాడు సాగర్.
సాగర్ పేరుతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన ఆయన.. అసలు పేరు  విద్యాసాగర్ రెడ్డి. పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. సాగర్ డైరెక్ట్ చేసిన  రామసక్కనోడు సినిమాకు  మూడు నంది పురస్కారాలు లభించాయి. టాలీవుడ్ లో దాదాపు 30 సినిమాలను డైరెక్ట్ చేశారు సాగర్.. శ్రీను వైట్ల లాంటి ఎంతో మంది దర్శకులు సాగర్ దగ్గర పనిచేసినవారే. అంతే కాదు  తెలుగు ఫిలిం అసోసియేషన్ కు అధ్యక్షుడిగా కూడా సాగర్ పనిచేశారు. 
 

click me!