“పరేషాన్” OTT రిలీజ్,ఎప్పుడు, ఏ ప్లాట్ ఫామ్ లో

By Surya PrakashFirst Published Jun 2, 2023, 6:01 PM IST
Highlights

“మాసూద” తో మంచి హిట్ అందుకున్న   తిరువీర్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “పరేషాన్” ఈ రోజు రిలీజైంది.  కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ఎప్పుడు ఓటిటిలోకి వస్తుందో చూద్దాం.


తెలంగాణ నేపధ్యంలో వచ్చిన మరో సినిమా 'పరేషాన్' ఈ రోజు విడుదల అయింది. రూపక్ రోనాల్డ్ సన్ దీనికి దర్శకుడు కాగా, తిరువీర్ హీరో. ఈ సినిమాకి ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ప్రెజంటర్ గా వుంది, సినిమాని ప్రమోట్ చేసాడు. అయినా సినిమా భాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కవుట్ కాలేదు. సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటిలో చూద్దామని చాలా మంది ఫిక్స్ అయ్యారు. ఈ నేపధ్యంలో ఓటిటిలో ఎప్పుడు రానుంది. ఏ ఓటిటి సంస్దకు రైట్స్ ఇచ్చారో చూద్దం. 

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ...ఈ కామెడీ ఎంటర్టైనర్ డిజిటల్ హక్కులను సోనీ లివ్ సొంతం చేసుకుంది. ఎగ్రిమెంట్ ప్రకారం సినిమా హిట్ అయితే నెల రోజుల తర్వాత ఓటిటిలోకి వస్తుంది. కానీ ఈ సినిమా రిజల్ట్ బట్టి చూస్తుంటే పది హేను రోజులు లోపే సినిమా ఓటిటిలో వచ్చేస్తుందని చెప్తున్నారు.

ఇక “పరేషాన్” చిత్రంలో అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్  వరకు పర్వాలేదనిపిస్తుంది. అలాగే తిరువీర్ మంచి నటన కనబరిచాడు. అయితే ఇంట్రస్టింగ్ గా సాగని సెకండాఫ్, నవ్వు తెప్పించని కొన్ని కామెడీ సీన్స్ విసిగిస్తాయి. దీనితో ఈ చిత్రం జస్ట్ రొటీన్ యావరేజ్ ఫ్లిక్ గా నిలిచిపోయింది.  'బలగం' సినిమా తెలంగాణా పల్లె జీవనానికి అద్దం పట్టింది. అందులో భావోద్వేగాలు బాగా పండాయి, సినిమా అందుకే పెద్ద హిట్ అయింది. 'దసరా' సినిమా కూడా  బాగా ఆడింది .పరేషాన్' మూవీ విషయానికి వస్తే...దర్శకుడు రూపక్ రోనాల్డ్ సన్ ఇందులో పాత్రలను సహజంగా చూపించాడు. ప్రతీ పాత్ర చాలా సహజంగా వుండి ఆ పాత్రే కనపడుతుంది తప్ప అందులో నటుడు కనిపించడు, అంతలా తీసాడు. కానీ తెలంగాణా అంటే తాగుడు, తినుడు అనేట్టుగా ఈ సినిమాలో చూపించాడనే విమర్శలు వచ్చాయి.

'పరేషాన్' చిత్రానికి రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయన రెండో చిత్రమిది. దీని కంటే ముందు సంపూర్ణేష్ బాబు హీరోగా 'కొబ్బరి మట్ట' సినిమా తెరకెక్కించారు. అది కామెడీ సినిమా. 'పరేషాన్' సైతం తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన కామెడీ సినిమా. ఇందులో తిరువీర్ జోడీగా పావని కరణం నటించారు. ఇంతకు ముందు 'హిట్ 2' సినిమాతో పాటు ఆహా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్ 'ద బేకర్ అండ్ ద బ్యూటీ', 'ది సిన్'లో నటించారు. వాల్తేరు ప్రొడక్షన్స్ పతాకంపై సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్ పతాకంపై రానా దగ్గుబాటి సమర్పణలో సినిమా విడుదలైంది.

ఈ చిత్రానికి యశ్వంత్ నాగ్ సంగీతం సమకూర్చగా, వాల్తేరు ప్రొడక్షన్స్‌ పై సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన పరేషాన్‌లో బన్నీ అభిరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, బుద్దెరా ఖాన్, రవి మరియు రాజు బేడిగల కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి ఈ చిత్రానికి సమర్పకుడు గా వ్యవహరిస్తున్నారు.

 

click me!