
యువ కథానాయకుడు సందీప్ కిషన్లో హీరోగానే కాదు నిర్మాతగా కూడా ఆకట్టుకుంటున్నాడు. ప్రజలకు రుచికరమైన భోజనం, వంటలు వడ్డించడానికి వివాహ భోజనంబు అని హైదరాబాద్ నగరంలో, తెలుగు రాష్ట్రాల్లో రెస్టారెంట్లు ప్రారంభించి తమ సేవలు అందిస్తున్నాడు సందీప్. ఈ రెస్టారెంట్లు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు వివాహ భోజనంబు పేరుతో ఓ సినిమా నిర్మించడానికి సందీప్ కిషన్ శ్రీకారం చుట్టాడు.
సూపర్ హిట్ సినిమా నిను వీడని నీడను నేనేతో సందీప్ కిషన్ నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. వెంకటాద్రి టాకీస్ నిర్మాణ సంస్థను స్థాపించి ప్రొడక్షన్ నెం1గా ఆ సినిమా నిర్మించాడు. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ఏ1 ఎక్స్ప్రెస్లో సందీప్ కిషన్ నిర్మాణ భాగస్వామి. వెంకటాద్రి టాకీస్ సంస్థలో అది ప్రొడక్షన్ నెం2. ఇప్పుడు ప్రొడక్షన్ నెం3గా వివాహ భోజనంబు సినిమాను ప్రకటించాడు సందీప్.
వెంకటాద్రి టాకీస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ పతాకాలపై రూపొందనున్న `వివాహ భోజనంబు` చిత్రానికి సందీప్ కిషన్, శినీష్ నిర్మాతలు. ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత పి. కిరణ్ (జెమిని కిరణ్) సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకుడు. సోమవారం సినిమా ప్రీ–లుక్ విడుదల చేశారు. త్వరలో ఫస్ట్ లుక్తో పాటు ఈ సినిమాలో హీరో, హీరోయిన్, ఇతర నటీనటుల వివారాలను వెల్లడించనున్నారు.