ప్రముఖ దర్శకుడు సుకుమార్ కు తన తండ్రి బండ్రెడ్డి తిరుపతి రావు నాయుడు అంటే చాలా ఇష్టం. ఆ విషయం చాలా సార్లు ఆయన వ్యక్తం చేసారు. ఆ మధ్యన ఎన్టీఆర్ తీసిన `నాన్నకు ప్రేమతో` కథ.. తన తండ్రి అంశయ్యపై ఉన్నప్పుడే పుట్టిందని చెప్పారు. ఆ విషయాన్ని `నాన్నకు ప్రేమతో` విడుదల సందర్భంలో.. వేదికపై సుకుమార్ కన్నీటి పర్యంతం అవుతూ చెప్పారు కూడా. అంతేకాదు ఆ మధ్యన `ఈనాడు` దిన పత్రిక లో నాన్నకు ఓ ఉత్తరం కూడా రాసి, తన ప్రేమ వ్యక్తం చేసారు.
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కు తన తండ్రి బండ్రెడ్డి తిరుపతి రావు నాయుడు అంటే చాలా ఇష్టం. ఆ విషయం చాలా సార్లు ఆయన వ్యక్తం చేసారు. ఆ మధ్యన ఎన్టీఆర్ తీసిన `నాన్నకు ప్రేమతో` కథ.. తన తండ్రి అంశయ్యపై ఉన్నప్పుడే పుట్టిందని చెప్పారు. ఆ విషయాన్ని `నాన్నకు ప్రేమతో` విడుదల సందర్భంలో.. వేదికపై సుకుమార్ కన్నీటి పర్యంతం అవుతూ చెప్పారు కూడా. అంతేకాదు ఆ మధ్యన `ఈనాడు` దిన పత్రిక లో నాన్నకు ఓ ఉత్తరం కూడా రాసి, తన ప్రేమ వ్యక్తం చేసారు.
అవన్నీ ఒకెత్తు... ఇప్పుడు తన తండ్రి జ్ఞాపకార్థం.. తన సొంత ఊరులో ఓ స్కూలు భవనాన్ని కట్టిస్తున్నాడు. సుకుమార్ సొంతూరు తూర్పుగోదావరి జిల్లా రాజోలు దగ్గర మట్టపర్రు. అక్కడ ప్రభుత్వ పాఠశాలకు పక్కా భవనం లేదు. అందుకే సుకుమార్ తన తండ్రి జ్ఞాపకార్థం సొంత ఖర్చుతో అక్కడ రెండు అంతస్థుల భవనం కట్టిస్తున్నాడు. ఈరోజు ఈ భవన నిర్మాణానికి రాజోలు ఎం.ఎల్.ఏ. రాపాక వరప్రసాదరావు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు.
తన పెద్దన్నయ్య శ్రీ బండ్రెడ్డి వెంకటేశ్వర రావు పాఠశాల భవనానికి శంకుస్థాపన చేయగా.. భవనం ఖర్చు దాదాపు 14 లక్షల రూపాయాలు అవుతుందని తెలుస్తుండగా, ఆ ఖర్చంతా సుకుమార్ భరిస్తానని చెప్పారట. వీలైనంత త్వరగా పాఠశాల భవనం పూర్తి చేయాలని సుకుమార్ భావిస్తున్నారట.
ఇక సుకుమార్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ఇవి కాకుండా..తను నిర్మాతగా మారి కొన్ని సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలాగే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చి బాబు డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఉప్పెన’ సినిమాను నిర్మించి రిలీజ్ కోసం చూస్తున్నారు.