శ్రీవిష్ణు `సింగిల్‌` మూవీ కలెక్షన్లు.. షాకింగ్‌ ఓపెనింగ్స్

శ్రీ విష్ణు హీరోగా నటించిన `సింగిల్‌` మూవీ శుక్రవారం విడుదలై పాజిటివ్‌ టాక్‌ ని తెచ్చుకుంది. అయితే మొదటి రోజు కలెక్షన్లు కూడా భారీగానే వసూలు చేయడం విశేషం. 
 

Google News Follow Us

యంగ్‌ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ గా `సింగిల్` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో వెన్నెల కిశోర్‌ ముఖ్య పాత్ర పోషించారు. కార్తీక్‌ రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి అల్లు అరవింద్‌ సమర్పకులు కావడం విశేషం.

విద్యా కొప్పినీడు, భాను ప్రతాప్‌, రియాజ్‌ చౌదరీ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. మొదటి ఆట నుంచి పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. 

హిలేరియస్‌ కామెడీగా `సింగిల్‌`

కామెడీని ప్రధానంగా చేసుకుని తెరకెక్కింది `సింగిల్‌`. ప్రేమ పెళ్లి కోసం హీరో పడే పాట్లు, అమ్మాయిలు తనకు పడకపోవడంతో ఆయన స్ట్రగుల్స్, సాహసాలను ఫన్నీ వేలో చూపించారు.

సందర్భానుసారంగా పుట్టే కామెడీని నమ్ముకుని దాన్ని బాగా వర్కౌట్‌ చేశారు. అది సినిమాలో వర్కౌట్‌ అయ్యింది. ఆడియెన్స్ కి హిలేరియస్‌ కామెడీని అందిస్తుంది. దీంతో సినిమా బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తుంది. 

శ్రీవిష్ణు కెరీర్‌లో `సింగిల్‌`కి బెస్ట్ ఓపెనింగ్స్

ఇక ఈ మూవీ కలెక్షన్ల పరంగానూ సత్తా చాటుతుంది. మంచి ఓపెనింగ్స్ ని సాధించింది. మొదటి రోజు కలెక్షన్లని ప్రకటించింది టీమ్‌. దాదాపు రూ. 4.15కోట్లు వసూలు చేసినట్టు వెల్లడించింది. ఇది శ్రీవిష్ణు కెరీర్‌లోనే అత్యధికం అని చెప్పొచ్చు.

అయితే వాస్తవంగా మూడున్నర కోట్లకుపైగానే ఉంటాయని తెలుస్తుంది. ఏదేమైనా `సింగిల్‌` మూవీ బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ని తెచ్చుకుంది. హిలేరియస్‌ కామెడీనే సినిమాకి ప్రధాన బలం. అదే ఆడియెన్స్ ని థియేటర్ కి రప్పిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

`సింగిల్‌` బడ్జెట్‌, ప్రీ రిలీజ్‌ బిజినెస్

ఈ సందర్భంగా `సింగిల్‌` మూవీ బడ్జెట్‌, ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ లెక్కలు చూస్తే,ఈ చిత్రానికి సుమారు రూ.14కోట్ల బడ్జెట్‌ అయ్యిందని సమాచారం. అన్ని ప్రమోషనల్‌ ఖర్చులు కలుపుకుని. అయితే సినిమా వ్యాపారం కూడా బాగానే జరిగింది. సుమారు ఏడు కోట్లకు అమ్ముడుపోయిందని సమాచారం.

థియేట్రికల్‌ బిజినెస్‌ ప్రకారం ఈ మూవీ 15కోట్లు వసూలు చేస్తే బయ్యర్లు సేఫ్‌గా ఉంటారు. నిర్మాతకి ఓటీటీ, ఆడియో రూపంలో మరికొంత వస్తుంది. సినిమా టాక్‌ని చూస్తుంటే ఇది మున్ముందు భారీగానే వసూలు చేసే అవకాశం ఉంది. కాకపోతే ఇండియా పాకిస్తాన్‌ యుద్ధ ప్రభావం పడుతుందా? అనేది చూడాలి.  
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on