ఆన్‌ లైన్‌ కల్చర్‌పై శృతి హాసన్‌ షాకింగ్‌ కామెంట్స్.. విద్వేషాలకు కేరాఫ్‌గా నిలుస్తుందంటూ వ్యాఖ్యలు..

Published : Nov 04, 2022, 05:45 PM ISTUpdated : Nov 04, 2022, 07:23 PM IST
ఆన్‌ లైన్‌ కల్చర్‌పై శృతి హాసన్‌ షాకింగ్‌ కామెంట్స్.. విద్వేషాలకు కేరాఫ్‌గా నిలుస్తుందంటూ వ్యాఖ్యలు..

సారాంశం

సోషల్‌ మీడియాలో హేట్‌ కల్చర్‌పై, బైకాట్‌ కల్చర్‌ పై స్టార్‌ హీరోయిన్‌ శృతి హాసన్‌ స్పందించింది. పలు షాకింగ్‌ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది. 

స్టార్‌ హీరోయిన్‌ శృతి హాసన్‌ సోషల్‌ మీడియాపై స్పందించారు. ఆది ఎలా తప్పు దారిలో వెళ్తుందో తెలిపారు. విద్వేషాలకు కేరాఫ్‌గా నిలుస్తుందంటూ ఆమె షాకింగ్‌ కామెంట్లు చేశారు. సోషల్ మీడియా వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో, నష్టాలు కూడా అలానే ఉన్నాయి. ఇవి చాలా వరకు ట్రోల్స్ కి వేదికలుగా మారుతున్నాయి. సెలబ్రిటీలే టార్గెట్‌గా ఎక్కువగా ట్రోల్స్ జరుగుతుంటాయి. బాలీవుడ్‌లో `బైకాట్‌` ట్యాగ్స్ తో ట్రెండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై శృతి హాసన్‌ స్పందించింది. 

ఈ బైకాట్‌ లాంటిది కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాదని, చాలా రంగాల్లో ఉందని తెలిపింది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పింది శృతి. దీనికి చాలా కారణాలున్నాయని, దీనిపై అందరు ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. సినిమాలను బ్యాన్‌ చేయాలనే కల్చర్‌ ఓరకమైన బెదిరింపు చర్యగా, దాడి చేయడం లాంటిదే అని పేర్కొంది. అయితే దీన్ని మనం సినిమా ఇండస్ట్రీకి పరిమితమైందనిగానేమనం చూస్తున్నామని, అంతకు మించి సమాజంలో ఈ ఆన్‌లైన్‌ కల్చర్‌ చాలా ఉందని తెలిపింది. ఇది సమాజంలో ద్వేషాలు నింపేలా మారిందని వెల్లడించింది శృతి. 

అంతేకాదు తనకు ఎదురైన సంఘటన కూడా పంచుకుంది. తాను కూడా పర్సనల్‌గా ఇలాంటి ద్వేషాన్ని ఎదుర్కోవల్సి వచ్చిందని చెప్పింది. తనని చుడైల్‌(మంత్రెగత్తె) అని పిలుస్తుంటారని, ప్రస్తుత ప్రపంచం ప్రతికూల ప్రదేశంగా మారింది. కానీ దాన్ని అధిగమిస్తామని తనకు తెలుసు అని, దీనిపై తన సొంతంగా ఆలోచిస్తానని తెలిపింది. ప్రస్తుతం శృతి చేసిన ఈ కామెంట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

శృతి హాసన్‌ నటిగా, సింగర్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. లాక్‌ డౌన్‌ కి ముందు ఆమె మ్యూజిక్‌ పై దృష్టి పెట్టింది. కానీ మళ్లీ సినిమాలపై ఫోకస్‌పెట్టింది. మ్యూజిక్‌కి బ్రేక్‌ ఇస్తూ సినిమాల్లో బిజీ అవుతుంది. ప్రస్తుతం ఆమె భారీ చిత్రాల్లో భాగమవుతుంది. అందులో ప్రభాస్‌తో `సలార్`, చిరంజీవితో `వాల్తేర్‌ వీరయ్య`, బాలకృష్ణతో `వీరసింహారెడ్డి` చిత్రాలున్నాయి. వచ్చే ఏడాదిలో దాదాపు మూడు సినిమాలతో ఎంటర్‌టైన్‌ చేయబోతుంది కమల్‌ తనయ. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Ram Charan Review: డెకాయిట్‌ మూవీకి రామ్‌ చరణ్‌ రివ్యూ.. అంత బాగానే ఉంది, అసలు విషయం వదిలేశాడు
Chiranjeevi: ఎన్టీరామారావుకి నచ్చిన చిరంజీవి సినిమా ఇదే.. మెగాస్టార్‌కే కాదు, మెగా ఫ్యామిలీకీ చాలా స్పెషల్‌