కెరీర్ మాంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఒక్కసారిగా సినిమాలు చేయడం మానేసి షాక్ ఇచ్చింది శృతిహాసన్. తన లవర్ మైఖేల్ తో వివాహం కోసమే శ్రుతి ఈ డెసిషన్ తీసుకుందని అందరు భవించారు. అయితే రీసెంట్ గా హఠాత్తుగా వీరిద్దరూ విడిపోయారు. రీసెంట్ గా లండన్లో కొన్ని లైవ్ మ్యూజిక్ షో లో నిర్వహించిన శృతి మళ్లీ సినిమాలలో నటించేందుకు సిద్ధమయ్యారు.
కెరీర్ మాంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఒక్కసారిగా సినిమాలు చేయడం మానేసి షాక్ ఇచ్చింది శృతిహాసన్. తన లవర్ మైఖేల్ తో వివాహం కోసమే శ్రుతి ఈ డెసిషన్ తీసుకుందని అందరు భవించారు. అయితే రీసెంట్ గా హఠాత్తుగా వీరిద్దరూ విడిపోయారు. రీసెంట్ గా లండన్లో కొన్ని లైవ్ మ్యూజిక్ షో లో నిర్వహించిన శృతి మళ్లీ సినిమాలలో నటించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేఫధ్యంలో సినిమాలు మళ్లీ కమిటవ్వటం మొదలెట్టింది. అందులో భాగంగా ఆమె ఓ హాలీవుడ్ ప్రాజెక్టు కమిటయ్యింది.
యు ఎస్ ఏ నెట్వర్క్స్ నిర్మించనున్న ‘ట్రెండ్ స్టోన్’ సిరీస్ లో ఓ కీలక పాత్రకోసం నిర్మాతలు శృతి హాసన్ ను సంప్రదించారని సమాచారం. జేసన్ బౌర్న్ సిరీస్ ఆధారంగా తెరకెక్కనున్న ఈ యాక్షన్ ఎపిసోడ్స్ లో శృతి హాసన్ కనిపించనుంది. ఇందులో ఆమె వెయిట్రెస్గా కనిపిస్తూ సీక్రెట్ గా హత్యలు చేసే అమ్మాయి పాత్రలో కనిపించనున్నారట.
ఇక ఈ ఎపిసోడ్కు రామిన్ బహ్రానీ దర్శకత్వం వహిస్తున్నారు. అమెరికా, భారత్లో ఈ ఎపిసోడ్ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. కెరీర్ పరంగా ఈ ప్రాజెక్టు శ్రుతికి మంచి ఆఫర్. ఓ హీరోయిన్ గా శ్రుతి హాసన్ కెరీర్ లోనే అత్యంత పెద్ద ప్రాజెక్ట్ ఇదే. ఈ సీరీస్ విజయం అయితే కనుక, ప్రియాంక చోప్రాకు వచ్చినంత పేరు శ్రుతిహాసన్కు కూడా వస్తుంది. దీంతో ఆమెకు ఇంటర్నేషనల్ గా గుర్తింపు లభిస్తే.. హాలీవుడ్ సినిమాల్లో అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది.