
తరుణ్ - శ్రియా జంటగా... త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా నువ్వే నువ్వే. ప్రకాశ్ రాజ్ ఇంపార్టెంట్ రోల్ లో నటించిన ఈ మూవీ బ్లక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా స్పెషల్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు టీమ్. ఈ సందర్భంగా ఈవెంట్ లో హీరో తరుణ్ తో పాటు శ్రీయా, త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రకాశ్ రాజ్, మరియు నిర్మాతలు పాల్గొన్నారు.
ఈ సదర్భంగా శ్రీయా మాట్లాడుతూ.. ఇంత మంది కథను అందించి.. మంచి సినిమాను మాతో తీసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. ఇక ప్రకాశ్ రాజ్ నిజంగా నా పేరెంట్స్ ను మరిపించారు. మీతో నటించడం నాకు గౌరవంగా ఫీల్ అవుతున్నాను అన్నారు శ్రీయ. ఈ క్రమంలోనే హీరో తరుణ్ ను ఆకాశానికెత్తింది శ్రీయ. తను అమేజింగ్ కో ఆర్టిస్ట్ అని పొగడ్తలతో ముంచెత్తింది. అందరూ చూస్తుండగానే తరుణ్ ను ఘాడంగా ముద్దాడింది శ్రీయ. ఈ సీన్ చూసి అంతా అవాక్కయ్యారు.
ఇక తరుణ్ మాట్లాడుతూ...ఈ సినిమా నిన్న మొన్న చేసినట్టుంది. అప్పుడే 20 ఏళ్లు అయ్యాయంటే నమ్మబుద్ది కావడంలేదు అన్నాడు. హీరోగా నా ఫస్టు మూవీకి త్రివిక్రమ్ గారు డైలాగ్స్ రాశారు. డైరెక్టర్ గా ఆయన ఫస్టు సినిమాకి హీరోగా నేను చేయడం నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఇకపై ఆయన ఎంతమంది హీరోలతో చేసినా ఆయన ఫస్టు హీరో మాత్రం నేనే. ఇప్పటికీ నేను ఎక్కడికైనా వెళితే, నువ్వే నువ్వే లాంటి సినిమా ఇంకొక్కటి చేయండి" అని అడుగుతూ ఉంటారు" అంటూ చెప్పుకొచ్చాడు.