బుల్లితెర నటి సూసైడ్ కేసులో ఉహించని మలుపు.. లోదుస్తులపై స్పెర్మ్

By Asianet NewsFirst Published May 30, 2023, 5:05 PM IST
Highlights

బుల్లితెర నటి ఆకాంక్ష దూబే సూసైడ్ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. మార్చి 26న ఆకాంక్ష దూబే వారణాసిలో ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మృతిపై ముందు నుంచి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

బుల్లితెర నటి ఆకాంక్ష దూబే సూసైడ్ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. మార్చి 26న ఆకాంక్ష దూబే వారణాసిలో ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మృతిపై ముందు నుంచి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆకాంక్ష దూబే భోజ్ పురి టివి సీరియల్ నటిగా రాణిస్తూ ఇలా బలవన్మరణానికి పాల్పడింది. 

కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ ప్రకారం పోలీసులు అనుమానంతో ఆమె ప్రియుడు సమర్ సింగ్ ని అతడి సోదరుడు సంజయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు లోతుగా వెళుతున్న కొద్దీ ఆకాంక్ష సుడైడ్ కేసులో పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పోలీసులు ఆమె లోదుస్తులపై స్పెర్మ్ గుర్తించినట్లు మీడియాకి తెలిపారు. 

దీనితో స్పెర్మ్ ఆధారంగా కోర్టు అనుమతి తీసుకుని అనుమానితులపై డీఎన్ఏ టెస్ట్ నిర్వహించబోతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆమె లోదుస్తులపై స్పెర్మ్ ఉందంటే.. అత్యాచారం ఏమైనా జరిగిందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. 

ఈ కేసులో అనుమానితులుగా ఉన్న మరో ఇద్దరు సందీప్, అరుణ్ పాండే లపై కూడా డీఎన్ఏ టెస్ట్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఆకాంక్షని ఆమె ప్రియుడు సమర్, సంజయ్ తో కలసి వేధించడం వల్లే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుంది అని ఆమె తల్లి కేసు నమోదు చేశారు. మార్చి 26న ఆకాంక్ష దూబే వారణాసిలో ఓ హోటల్ లో సూసైడ్ చేసుకుంది. 

click me!