చెరకు రసంలో 10 నిద్రమాత్రలు కలిపి.. సింగర్ దివ్య ఇండోరా హత్య కేసులో దిమ్మతిరిగే నిజాలు

By team teluguFirst Published May 26, 2022, 8:04 PM IST
Highlights

మే 11న కనిపించకుండా పోయిన హర్యానా సింగర్ దివ్య ఇండోరా అలియాజ్ సంగీత కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మూడు రోజుల తర్వాత ఆమె శవమై కనిపించింది. 

మే 11న కనిపించకుండా పోయిన హర్యానా సింగర్ దివ్య ఇండోరా అలియాజ్ సంగీత కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మూడు రోజుల తర్వాత ఆమె శవమై కనిపించింది. అంతకు ముందే ఆమె తల్లిదండ్రులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. దివ్య మరణించిన తర్వాత పోలీసులు అనుమానంతో ఆమె స్నేహితులు రవి, అనిల్ లని అరెస్ట్ చేశారు. 

వీరిద్దరిని పోలీసులు విచారణ చేపట్టగా దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దివ్యని తామే హత్య చేసినట్లు రవి, అనిల్ అంగీకరించారు. రిలేషన్ షిప్, ప్రేమ వ్యవహారాల్లో విభేదాలు తలెత్తడంతో ఆమెపై పగ పెంచుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం దివ్యని హత్య చేశారు. 

పోలీసుల కథనం ప్రకారం దివ్య హత్యలో అసలైన సూత్రధారి రవి. అనిల్ అతడికి సహకారం అందించాడు. రవి సూచనల మేరకు అనిల్ ఢిల్లీకి వెళ్లి దివ్యని కారులో ఎక్కించుకున్నాడు. హర్యానాలోని మొహం ప్రాంతం వైపుకు వెళుతున్న టైంలో అనిల్ ఆమెకు చెరకు రసంలో 10 నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. 

కల్ నౌరుకి వెళ్లిన తర్వాత రవి అక్కడ వాళ్ళని కలిశారు. డాబాలో భోజనం చేసి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టారు. దారిలో దివ్య అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. దీనితో ఆమెని గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మొహం ప్రాంతంలోనే ఆమె మృతదేహాన్ని పాతిపెట్టారు. దివ్య మరణంతో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. 

click me!