మీడియా సంస్థలపై శిల్పాశెట్టి పరువు నష్టం దావా..

Published : Jul 29, 2021, 09:13 PM ISTUpdated : Jul 29, 2021, 09:14 PM IST
మీడియా సంస్థలపై శిల్పాశెట్టి పరువు నష్టం దావా..

సారాంశం

తమ రేటింగ్‌ కోసం, సెన్సేషన్‌ కోసం తమని కించపరిచేలా వ్యవహరించారంటూ మీడియా సంస్థలపై శిల్పాశెట్టి కోర్ట్ ని ఆశ్రయించారు. ఈ మేరకు పరువు నష్టం దావా వేశారు.

నటి శిల్పాశెట్టి మీడియా సంస్థలపై పరువునష్టం దావా వేసింది. కొన్ని మీడియా సంస్థలు తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా ఆర్టికల్స్ ప్రచురించాయని, వార్తలను టెలికాస్ట్ చేశాయని  గురువారం ఆమె ముంబాయి హైకోర్ట్ లో ఫైల్‌ దాఖలు చేశారు. తనతోపాటు తన భర్త, తన కుటుంబానికి పరువు నష్టం కలిగి విధంగా మీడియా కథనాలున్నాయని ఆమె తన పిటిషన్‌లో పేర్కొంది. తమ రేటింగ్‌ కోసం, సెన్సేషన్‌ కోసం తమని కించపరిచేలా వ్యవహరించారంటూ 29 మీడియా సంస్థలపై ఆమె కోర్ట్ ని ఆశ్రయించారు. అయితే దీనిపై బాంబే కోర్టు రేపు(శుక్రవారం) విచారణ చేపట్టనుందని సమాచారం. ఇందులో ఎలక్ర్టానికి్‌, ప్రింట్‌, డిజిటల్‌ మీడియా సంస్థలు, అలాగే మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారని తెలుస్తుంది. ఆ వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే రాజ్‌కుంద్రాకి సంబంధించి పోర్న్ వీడియోల రాకెట్‌లో అనేక కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి.చాలా మంది హీరోయిన్లు బయటకు వచ్చి రాజ్‌కుంద్రా ఆగడాలను వెల్లడిస్తున్నారు. ఇప్పటికే నటి షెర్లీన్‌ చోప్రా తీవ్ర ఆరోపణలు చేసింది. పోలీస్‌ విచారణలోనూ అనేక షాకింగ్‌ విషయాలను వెల్లడించింది. మార్చి 2019 మార్చిలో రాజ్‌కుంద్రా, అతని టీమ్‌ను బిజినెస్ మీటింగ్ కోసం ఆమె కలిసినట్లు చెప్పారు. మీటింగ్ జరిగిన కొన్ని రోజుల తర్వాత ఎలాంటి సమాచారం లేకుండా రాజ్ తన ఇంటికి వచ్చారని పోలీసులకు షెర్లీన్ చోప్రా స్టెట్‌మెంట్ ఇచ్చారు.

శిల్పా శెట్టితో సరైన సంబంధాలు లేవని ఇంట్లో ఇబ్బందికరంగా ఉంటోందని రాజ్‌కుంద్రా తనతో చెప్పినట్లు ఆమె వెల్లడించారు. తనను హత్తుకుని ముద్దుపెట్టుకున్నాడని, అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసుల విచారణలో షెర్లీన్ చోప్రా తెలిపారు. రాజ్‌కుంద్రా ప్రవర్తనతో భయం వేసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయినట్లు షెర్లీన్ చోప్రా వెల్లడించారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akira Nandan: నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా? రేణు దేశాయ్‌ ఫోన్‌ చేస్తే పవన్‌ రియాక్షన్‌ ఇదే
రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యరాయ్, ఎమోషనల్ కామెంట్స్