తాప్సీ, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 21న డుంకీ సినిమా థియేటర్లలోకి వస్తోంది.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Shahrukh Khan), స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘డంకీ’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది ఈ సినిమా పై దేశ వ్యాప్తంగా మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే డంకీ సినిమాని డిసెంబర్ 21న పాన ఇండియా వైడ్ రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించి ప్రమోషన్స్ మొదలెట్టారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథేంటి అనే విషయం గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ చిత్రం సినాప్సిస్ బయిటకు వచ్చిది. అదేమిటంటే...
పంజాబ్ లో ఉన్న నలుగురు పల్లెటూరు స్నేహితుల జీవితాశయం,కల ఒకటే..వాళ్లంతా ఇంగ్లాండ్ వెళ్లాలని. వాళ్ల సమస్య ఏమిటంటే... టిక్కెట్,వీసా . అయితే వాళ్ల కల నేర్చవేటానికి ఓ సైనికుడు ముందుకు వస్తాడు. తను ఇంగ్లాండ్ చేరుస్తానని మాట ఇస్తాడు. అక్కడ నుంచి జరిగే జర్ని,బోర్డర్ సమస్యలు, స్నేహం, కుటుంబం పట్ల ప్రేమ, విలువలు చుట్టు తిరుగుతుంది. సవ్యంగా వీసా, పాస్ పోర్ట్ వచ్చేసి వెళ్తే ఏ తిప్పలూ ఉండవు. కానీ వారు వేరే మార్గం ఎంచుకుంటారు. అక్రమ ప్రయాణంలో వారు ప్రయాణం పెట్టుకుంటారు. అదెలా ఎలా ఏమిటి..అనేది ఫన్ తో కూడిన సీన్స్ తో సినిమా ఉండనుంది. డంకీ అంటే దేశ సరిహద్దుల వెంట అక్రమ ప్రయాణం గురించి వివరించే మార్గమని షారుక్ వివరించారు.
షారుఖ్ ఈ సంవత్సరం పఠాన్, జవాన్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమాకు దర్శకుడు, హీరో రెమ్యునరేషన్స్ మినహాయిస్తే కేవలం 85 కోట్లలో సినిమా పూర్తైందిట. 75 రోజులలో షూటింగ్ పూర్తైంది. షారూఖ్ పోర్షన్ కేవలం అరవై రోజులు లోపలే పూర్తైందని వినికిడి. పబ్లిసిటీ అన్ని కలిపి 125 కోట్ల లోపే అయ్యిందని సమాచారం. అంత పెద్ద స్టార్ హీరో సినిమా అంత తక్కువలో అవ్వటం బాలీవుడ్ కు పెద్ద షాక్ గా ఉంది. షారూఖ్, రాజ్ కుమార్ హిరానీ ఇద్దరూ ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్స్ గా ఉంటున్నారు.
రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కించిన డంకీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21న విడుదల కానుంది. ఈ చిత్రంలో తాప్సీ పన్ను, బోమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ కీలక పాత్రల్లో నటించారు. విక్కీ కౌశల్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రాజ్కుమార్ హిరానీ ఫిలిమ్స్, రెడ్ ఛిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్, జియో స్టూడియో బ్యానర్లపై రాజ్కుమార్ హిరానీ, గౌరీఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి అభిజాత్ జోషి, రాజ్కుమార్ హిరానీ, కనికా ధిల్లాన్ కథనందిస్తున్నారు.