శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు సెబీ షాక్...!

By team teluguFirst Published Jul 29, 2021, 9:22 AM IST
Highlights

సెబీ రాజ్ కుంద్రా సంస్థకు షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన వియాన్ సంస్థపై రూ. 3లక్షల జరిమానా విధించడం జరిగింది. వియాన్ సంస్థ ద్వారా రాజ్ కుంద్రా ఇన్సైడ్ ట్రేడింగ్ కి పాల్పడినట్లు గుర్తించిన సెబీ ఈ మేరకు ఫైన్ విధించడం జరిగింది.

శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా మరిన్ని సమస్యలలో చిక్కుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన చట్ట వ్యతిరేక కార్యకలాపాలు వెలికితీస్తున్న అధికారులు, కొత్త ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేస్తున్నారు. తనను బలవంతంగా పోర్న్ వీడియోలలో నటింప చేశారన్న ఓ నటి ఆరోపణల నేపథ్యంలో ఆయనపై మరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్లు సమాచారం. 


ఇదిలా ఉంటే సెబీ రాజ్ కుంద్రా సంస్థకు షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన వయాన్ సంస్థపై రూ. 3లక్షల జరిమానా విధించడం జరిగింది. viయాన్ సంస్థ ద్వారా రాజ్ కుంద్రా ఇన్సైడ్ ట్రేడింగ్ కి పాల్పడినట్లు గుర్తించిన సెబీ ఈ మేరకు ఫైన్ విధించడం జరిగింది. 

ఇక 45 రోజుల లోపు విధించిన ఫైన్ మొత్తం చెల్లించాలని వయాన్ సంస్థను ఆదేశించడం జరిగింది. 
వయాన్‌ సంస్థ ఉద్యోగులకు రాజ్‌కుందద్రాకు వ్యతిరేకంగా కీలక సమాచారాన్ని అందించారు.  కాగా  పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయి రిమాండులో ఉన్న రాజ్‌కుంద్రా బెయిల్‌ను కోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ మేరకు గర్యాన్ థోర్పే బెయిల్‌ పిటీషన్‌ను కూడా కోర్టు రద్దు చేసింది. పోర్న్ ఫిలిమ్స్ తయారీ, ఆన్‌లైన్ డిస్ట్రిబ్యూషన్  ద్వారా గత ఏడాది ఆగస్టు, డిసెంబర్ మధ్యకాలంలో కుంద్రా రూ. 1.17 కోట్లు ఆర్జించినట్లు  ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 11మంది ని అరెస్ట్ చేసిన చేసిన సంగతి తెలిసిందే. 

click me!