తాజాగా మాజీ హీరోయిన్ సమీరా రెడ్డికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తాజాగా ఈ విషయాన్ని ఆమె ఇన్స్టా స్టోరీస్ ద్వారా వెల్లడించారు. శనివారం కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని పేర్కొంది.
ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ స్టార్స్ వరుసగా కరోనా బారిన పడుతున్నారు. కరోనా భారత్లో విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఎవరి నుంచి కరోనా ప్రమాదం పొంచి ఉందో అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్, సోనూ సూద్, బాలీవుడ్ తారలు అర్జున్ రాంపాల్, రణ్బీర్ కపూర్, అక్షయ్, అలియాభట్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ హీరోయిన్ సమీరా రెడ్డికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తాజాగా ఈ విషయాన్ని ఆమె ఇన్స్టా స్టోరీస్ ద్వారా వెల్లడించారు. శనివారం కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని పేర్కొంది. అయితే, భర్త, ఇద్దరు పిల్లలు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వాళ్ల రిపోర్టులు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని, హోం క్వారంటైన్ అయ్యామని, వైద్యుల సూచనల మేరకు జాగ్రత్తలు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నామని చెప్పింది.
సమీరారెడ్డి ఫ్యామిలీ గోవాకు షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. గత ఆరునెలలుగా సమీరా రెడ్డి ఫ్యామిలీ గోవాలోనే ఉంటున్నారు. సమీరా రెడ్డి తెలుగులో చిరంజీవితో `జై చిరంజీవ`, `ఎన్టీఆర్తో `అశోక్`, `నరసింహుడు` చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్లో వరుస ఆఫర్లను అందుకున్న ఆమె పెళ్లి చేసుకున్నాక సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం భర్త, ఇద్దరు పిల్లలతో పూర్తిస్థాయిలో ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజమ్ గురించి సమీరారెడ్డి గతంలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గర్భంతో ఉన్నప్పుడు ఎదుర్కోన్న సంఘటనల గురించి కూడా ఆమె అప్పట్లో గుర్తు చేసుకుంది. మొదటి సారి తాను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తనలో వచ్చిన మార్పులు చూసి తనకు తానే నచ్చలేదని తెలిపింది.
అంతేకాకుండా సోషల్ మీడియాలో తన గురించి జనాలు చేసే కామెంట్లు కూడా దారుణంగా ఉండేవని.. వాటిని చూసి చాలా బాధపడేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. తన శరీరం గురించి జనాలు చేసే కామెంట్లు చూసినప్పుడు బాధగా ఉండేదని, ఆ తర్వాత వాటిని పెద్దగా పట్టించుకోవడం మానేశానని చెప్పింది. ప్రస్తుతం సమీరా తన అత్తయ్యతో కలిసి ఓ యూట్యూబ్ ఛానెల్ని రన్ చేస్తుంది. వంటకాల వీడియోలను పంచుకుంటుంది.