
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ సినిమా ‘ఖుషి’. విజయ్ నటిస్తున్న 11వ చిత్రంగా ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రేక్షకుల ముుందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయినా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ కూడా ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే ఇప్పటికే కాశ్మీర్ లోని పలు అందమైన లోకేషన్లలో ఈ చిత్ర షూటింగ్ కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా షూటింగ్ పై తాజాగా క్రేజీ అప్టేడ్ అందించారు.
గత నెల 23 తేదీ నుంచి కశ్మీర్ లో రెగ్యులర్ చిత్రీకరణ మొదలు పెట్టారు. అక్కడి అందమైన లొకేషన్స్ లో కీలక సన్నివేశాలను షూట్ చేశారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా చిత్ర బృందం గ్రూప్ ఫొటో దిగారు. కశ్మీర్ షెడ్యూల్ అమోజింగ్ ఫీల్ ఇచ్చింది, విజయ్, సమంతతో పాటు యూనిట్ అందరికీ కంగ్రాంట్స్ అంటూ దర్శకుడు శివ నిర్వాణ ట్వీట్ ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేశారు.
నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే హైదరాబాద్ లో మొదలవుతుంది. ఆ తర్వాత వైజాగ్, అల్లెప్పి లలో మిగతా షూటింగ్ చేయనున్నారు. ఇటీవలే విడుదల చేసిన "ఖుషి" టైటిల్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. పక్కా ప్లానింగ్ తో షూటింగ్ కంప్లీట్ చేసి డిసెంబర్ 23న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ చాలా ఎగ్జైటింగా ఫీలవుతోంది. ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండటంతో మరింత ఆసక్తి నెలకొని ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు పలు పాత్రలను పోషించనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘లైగర్’ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని మేకరస్ ఆగస్టు 26న రిలీజ్ చేసేందుకు షెడ్యూల్ చేశారు. అలాగే సమంత నటించిన ‘యశోద’ చిత్రం కూడా ఆగస్టులోనే 12న రిలీజ్ కానుంది.