శాకుంతలం, కాత్తు వాక్కుల రెండు కాదల్ సినిమాల రిలీజ్ తర్వాత సమంత సినిమాలకు బ్రేక్ తీసుకోనుందని సమాచారం.
సమంతకు గోల్డెన్ పీరియడ్ నడుస్తోంది. ఓబేబి సూపర్ హిట్ తర్వాత వెబ్ సీరిస్ ది ఫ్యామిలీ మెన్ 2 కూడా అదే స్దాయిలో సక్సెస్ అయ్యింది. 'ది ఫ్యామిలీ మెన్ 2' సంబంధింది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ అవార్డుల్లో బెస్ట్ యాక్ట్రెస్ (వెబ్ సిరీస్) అవార్డుకు కూడా ఎంపికయింది.
దాంతో ఆమెకు సినిమాల నుంచి ఓటీటి సంస్దల నుంచి వరస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ సమంత బ్రేక్ తీసుకోవాలనుకుంటోంది. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ అనుపమ చోప్రా మీడియాకు తెలియచేసారు.
గత కొద్ది కాలంగా మీడియా సమంత చేసే కొత్త చిత్రాలు అంటూ ప్రభాస్, పవన్ కల్యాణ్ సినిమాలు చెప్పుకొస్తున్నారు. ప్రభాస్-నాగశ్విన్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘ప్రాజెక్ట్ కె’లో సమంతను తీసుకోవాలనుకున్నారని.. కానీ నాగ అశ్విన్ ఆమెని పక్కన పెట్టారని మీడియాలో వార్తలొచ్చాయి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు వినపడింది. ఈ విషయమై తాజాగా అక్కినేని కోడలు మాట్లాడింది.
సమంత మాట్లాడుతూ....ప్రభాస్ సినిమాలో తనకు ఆఫర్ వస్తుందని అనుకున్నట్లు.. కానీ అలా జరగలేదని చెప్పుకొచ్చింది. అదే సమయంలో ప్రభాస్ సినిమా నుండి సమంతను తీసేశారని.. నాగశ్విన్ సమంతకు ఛాన్స్ ఇవ్వలేదంటూ వెబ్ మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయని.. దీని గురించి నాగశ్విన్ ను గట్టిగా అడగాలనుకుంటున్నా అంటూ నవ్వేసింది సమంత. అలాగే ప్రస్తుతం తనకు కొత్త సినిమాలు చేసే మూడ్ లేదని.. కొన్ని నెలల పాటు గ్యాప్ తీసుకుంటానని చెప్పుకొచ్చింది.
ఇక గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘శాకుంతలం’ షూటింగ్ పూర్తయిందని.. కొంతకాలం పాటు కొత్త కథలు కూడా విననని చెప్పేసింది. గ్యాప్ తీసుకొని కథలు వినడం మొదలుపెడతానని చెప్పింది. అదే సమయంలో తను ఇప్పటివరకు అయితే కొత్త సినిమా ఏదీ ఒప్పుకోలేదని.. పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలో కూడా తను లేనట్లు చెప్పింది సమంత.తను తన కుటుంబానికి కొంత సమయం కేటాయించాలనుకుంటున్నట్లు చెప్పింది. రాబోయే రోజుల్లో మహిళలు ప్రభావితం చేసే పాత్రల్లో నటించాలనుందంటూ చెప్పుకొచ్చింది.
సమంత నటించిన 'శాకుంతలం' సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం తమిళ చిత్రం 'కాత్తు వకుల రెండు కాదల్' షూటింగ్ లో బిజీగా ఉంది. మరోవైపు 'ఫ్యామిలీ మెన్ 2' వెబ్ సిరీస్ లో ఆమె పోషించిన రాజి పాత్రపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఆమె స్పందిస్తూ... ఎవరినైనా తాను బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరింది.