వాళ్లిద్దరి వల్లే నేనింకా బతికున్నా.. సోషల్ మీడియాలో సమంత పోస్ట్ వైరల్

By team teluguFirst Published Jan 23, 2022, 8:36 AM IST
Highlights

నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. చైతు సమంత గురించి ఇప్పటికి అభిమానులు చర్చించుకుంటున్నారు. దీనికి తోడు సమంత కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో వరుసగా పోస్ట్ లు పెడుతోంది.

నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. చైతు సమంత గురించి ఇప్పటికి అభిమానులు చర్చించుకుంటున్నారు. దీనికి తోడు సమంత కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో వరుసగా పోస్ట్ లు పెడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సమంత పరోక్షంగా పోస్ట్ లు పెడుతూ సరికొత్త చర్చకు కారణం అవుతోంది. 

అలాగే గ్యాప్ దొరికినప్పుడు వెకేషన్స్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం సమంత స్విట్జర్లాండ్ ట్రిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. సమంత స్విస్ అందాలలో ఎంజాయ్ చేస్తూ అక్కడి ఫోటోలు, వీడియోల్ని అభిమానులతో పంచుకుంటోంది. 

సమంత స్విస్ మంచు అందాలలో స్కీయింగ్ చేస్తూ సరికొత్త అనుభూతి పొందుతోంది. స్కీయింగ్ చేయడం అంటే అంత సులువేం కాదు. సరదాగా ఉంటుంది కానీ జాగ్రత్తగా చేయాలి. లేకుంటే ప్రమాదాలు జరుగుతాయి. సమంత కూడా ఇదే విషయాన్ని చెబుతూ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. 

'వీళ్లిద్దరి వల్లే నేనింకా బడితికున్నా' అంటూ సామ్ ఓ పిక్ షేర్ చేసింది. ఆ ఫొటోలో సమంతకు స్కీయింగ్ లో సాయం చేసిన ఇన్స్ట్రక్టర్లు ఉన్నారు. సమంత ఇటీవల సాహసాలు ఎక్కువగా చేస్తోంది. 100 కిమీ సైక్లింగ్, అడవుల్లో ట్రెక్కింగ్ లాంటి సాహసాలు చేస్తూ కొత్త అనుభూతి వెతుక్కుంటోంది సామ్. 

ఇదిలా ఉండగా సమంత ప్రస్తుతం యశోద, శాకుంతలం లాంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 తరహాలో కొత్త వెబ్ సిరీస్ లు చేసేందుకు కూడా సామ్ రెడీ అవుతోంది. 

 

click me!