స్టార్ హీరోని చంపేస్తామంటూ బెదిరింపులు!

By AN TeluguFirst Published Sep 25, 2019, 10:08 AM IST
Highlights

1998వ సంవత్సరంలో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ సందర్భంగా సల్మాన్‌ఖాన్‌ తన తోటి నటులు సైఫ్ ఆలీఖాన్, సోనాలీబెంద్రే, టబు, నీలం కొఠారీ, దుష్యంత్ సింగ్ 
లతో కలిసి రెండు కృష్ణ జింకలను వేటాడి చంపారనే కేసు జోథ్‌పూర్ కోర్టు దర్యాప్తు చేస్తోంది.

ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ సోషల్ మీడియాలో చేసిన హెచ్చరికలతో రాజస్తాన్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు మొదలుపెట్టారు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ ఈ నెల 27వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని జోథ్‌పూర్ కోర్టులో విచారణకు హాజరు కానున్నారు.

కోర్టు విచారణకు సల్మాన్ ఖాన్ వస్తోన్న నేపధ్యంలో అతడిని చంపేస్తామని గ్యారీ షూటర్ పేరిట ఫేస్ బుక్ లో హెచ్చరికలు జారీ చేశారు. సల్మాన్ ఖాన్ ఫోటోకి రెడ్ క్రాస్ మార్క్ చేసి 007 ముఠా పేరిత హెచ్చరికను పోస్ట్ చేయడం కలకలం రేపుతోంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.

సల్మాన్‌ఖాన్‌ కృష్ణజింకలను వేటాడిన కేసులో కోర్టుకు హాజరుకానున్న దృష్ట్యా తాము ఈ హెచ్చరికలపై ముందుజాగ్రత్త చర్యగా దర్యాప్తు చేస్తున్నామని రాజస్థాన్ డిప్యూటీ పోలీసు  కమిషనర్ డీ సింగ్ చెప్పారు.

1998వ సంవత్సరంలో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ సందర్భంగా సల్మాన్‌ఖాన్‌ తన తోటి నటులు సైఫ్ ఆలీఖాన్, సోనాలీబెంద్రే, టబు, నీలం కొఠారీ, దుష్యంత్ సింగ్ లతో కలిసి రెండు కృష్ణ జింకలను వేటాడి చంపారనే కేసు జోథ్‌పూర్ కోర్టు దర్యాప్తు చేస్తోంది.

click me!