అదరగొట్టేసిన హీరోయిన్.. ఇంటర్‌లో 82% మార్కులు!

By Siva KodatiFirst Published May 28, 2019, 9:10 PM IST
Highlights

టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన మరాఠి చిత్రం సైరత్ ఎంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఈ చిత్రంలో రింకు రాజ్ గురు హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో రింకు నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన మరాఠి చిత్రం సైరత్ ఎంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఈ చిత్రంలో రింకు రాజ్ గురు హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో రింకు నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. సైరత్ చిత్రం 2016లో విడుదలయింది. ఆ చిత్రం విడుదలయ్యే సమయంలో రింకు 10వ తరగతి విద్యార్థిని మాత్రమే. 

ఇదిలా ఉండగా ఇటీవలే రింకు ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఇటీవల వెలువడిన మహారాష్ట్ర ఇంటర్మీడియట్ ఫలితాల్లో రింకు 82 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. దీనితో నటిగానే కాదు, విద్యార్థిగా కూడా రింకు అదరగొట్టేస్తోందని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కేవలం చదువుపై శ్రద్ద చూపేందుకే చాలామంది కష్టపడుతుంటారు. కానీ రింకు సినిమాల్లో నటిస్తూనే 82 శాతం మార్కులు సాధించింది. 

ఈ విషయాన్ని రింకు తండ్రి మీడియాకు వివరించారు. తన కుమార్తె సినిమాల్లో నటిస్తూనే గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేస్తుందని తెలిపారు. రియాలిటీకి దగ్గరగా, తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన సైరత్ చిత్రం అఖండ విజయం సాధించింది. ఏకంగా 100 కోట్ల వసూళ్లు రాబట్టి దేశం మొత్తం మరాఠి చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుకునేలా చేసింది.  

click me!