సాయి పల్లవి డిజిటల్‌ ఎంట్రీ.. మణిరత్నం దర్శకత్వంలో!

By Satish ReddyFirst Published Jul 26, 2020, 2:39 PM IST
Highlights

మణిరత్నం, నెట్‌ఫ్లిక్స్‌లు సంయుక్తంగా నవరస పేరుతో తొమ్మిది ఎపిసోడ్స్‌ను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో ఒక్కో ఎపిసోడ్‌ను ఒక్కో దర్శకుడు రూపొందించనున్నారు. ఇందులో పరువు హత్యల నేపథ్యంలో ఓ ఎపిసోడ్ రూపొందనుంది. ఈ ఎపిసోడ్‌కు అసురన్‌  ఫేం వెట్రిమారన్‌ దర్శకత్వం వహించనున్నాడు.

ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా సినిమాలు పూర్తిగా ఆగిపోవటంతో ప్రజలు వినోదం  కోసం ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే స్టార్స్‌తో పాటు టాప్‌ డైరెక్టర్స్ వరకు అంతా  ఓటీటీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో స్టార్ డైరెక్టర్‌, టాప్‌ హీరోయిన్‌ కూడా ఓటీటీ ఎంట్రీ రెడీ అవుతున్నారు. జాతీయ స్థాయిలో పేరున్న మణిరత్నం కూడా త్వరలో ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే మణిరత్నం దర్శకుడిగా కాదు నిర్మాతగా ఓటీటీలోకి అడుగుపెడుతున్నాడు.

మణిరత్నం, నెట్‌ఫ్లిక్స్‌లు సంయుక్తంగా నవరస పేరుతో తొమ్మిది ఎపిసోడ్స్‌ను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో ఒక్కో ఎపిసోడ్‌ను ఒక్కో దర్శకుడు రూపొందించనున్నారు. ఇందులో పరువు హత్యల నేపథ్యంలో ఓ ఎపిసోడ్ రూపొందనుంది. ఈ ఎపిసోడ్‌కు అసురన్‌  ఫేం వెట్రిమారన్‌ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సిరీస్‌లో ప్రకాష్ రాజ్‌, సాయి పల్లవి తండ్రి కూతుళ్లుగా నటిస్తున్నారు. సాయి పల్లికి ఇదే తొలి డిజిటల్‌ మూవీ కావటం విశేషం.

ఇక సినిమాల విషయానికి వస్తే మణిరత్నం.. 2018లో చెక్క చివంత వానమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మణిరత్నం, ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పొన్నియన్‌ సెల్వన్‌ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రమ్‌, ఐశ్వర్యా రాయ్‌, కార్తి, జయం రవి, విక్రమ్‌ ప్రభు, త్రిష లాంటి టాప్ స్టార్స్‌ నటిస్తున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మణిరత్నం స్వయంగా నిర్మిస్తున్నాడు.

click me!