ఫ్లాప్ హీరోకి ఈసారైనా హిట్టొస్తుందా?

By Prashanth MFirst Published Oct 15, 2018, 4:25 PM IST
Highlights

సక్సెస్ లేక గత కొన్నేళ్లుగా సతమతమవుతున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ సారి ఫ్యాన్స్ ను ఎలాగైనా మెప్పించాలని డిఫరెంట్ కథతో రెడీ అవుతున్నాడు. నేడు తన పుట్టినరోజు సందర్బంగా కొత్త సినిమా లాంచ్ ఈవెంట్ ను కూడా నిర్వహించాడు.

సక్సెస్ లేక గత కొన్నేళ్లుగా సతమతమవుతున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ సారి ఫ్యాన్స్ ను ఎలాగైనా మెప్పించాలని డిఫరెంట్ కథతో రెడీ అవుతున్నాడు. నేడు తన పుట్టినరోజు సందర్బంగా కొత్త సినిమా లాంచ్ ఈవెంట్ ను కూడా నిర్వహించాడు. నేను శైలజా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తెచ్చుకున్న దర్శకుడు కిషోర్ తీరుమాల ఈ ప్రాజెక్ట్ ను తెరక్కిస్తున్నాడు. 

ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ సినిమాను నిర్మిస్తోంది. డీసెంట్ గా సినిమాను లాంచ్ చేసిన చిత్ర యూనిట్ రెగ్యులర్ షూటింగ్ ను తొందర్లోనే మొదలుపెట్టనుంది. డిఫరెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాకు చిత్రలహరి అనే టైటిల్ ను అనుకుంటున్నారు. మొదట నానితో ఈ కథ చేయాలనీ అనుకున్నారు. 

దర్శకుడు కొంత మంది హీరోలను సంప్రదించినప్పటికీ ఫైనల్ గా సాయి ధరమ్ తేజ్ వద్దకు చేరింది. సాయి ధరమ్ తేజ్ గత ఆరు చిత్రాలు ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యాయి. బడా దర్శకులతో పనిచేసినప్పటికీ అతనికి అదృష్టం కలిసిరాలేదు. ఇక ఇప్పుడు అతని ఆశలన్నీ కిషోర్ తిరుమలపైనే ఉంచాడు. అయితే ఈ డైరెక్టర్ గత చిత్రం ఉన్నది ఒకటే జిందగీ ప్లాప్ అయ్యింది. 

దీంతో సాయి సినిమాకు క్రేజ్ పెరగాలంటే ముందునుంచే ప్రమోషన్స్ బజ్ పెంచాలి. మరి ఈసారైనా నమ్మకంగా మెగా హీరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.  

click me!