తారక్ - చరణ్ లపై జక్కన్న కఠిన నిర్ణయం!

By Prashanth MFirst Published May 29, 2019, 11:46 AM IST
Highlights

బారి బడ్జెట్ తో తెరకెక్కుతున్న టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ RRR తెరపైకి వచ్చే తేదీ కోసం జనాలు ఎంతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే రిలీజ్ డేట్ పై ముందే క్లారిటీ ఇచ్చి మెగా నందమూరి అభిమానులను ఆనందంలో నింపిన జక్కన్న ఇప్పుడు మాత్రం కాస్త టెన్షన్ లో పెడుతున్నాడు. 

బారి బడ్జెట్ తో తెరకెక్కుతున్న టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ RRR తెరపైకి వచ్చే తేదీ కోసం జనాలు ఎంతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే రిలీజ్ డేట్ పై ముందే క్లారిటీ ఇచ్చి మెగా నందమూరి అభిమానులను ఆనందంలో నింపిన జక్కన్న ఇప్పుడు మాత్రం కాస్త టెన్షన్ లో పెడుతున్నాడు. 

ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్ ని కరెక్ట్ గా అనుకున్న సమయానికి పూర్తి చేస్తే ఈ ఏడాది చివర్లోనే సినిమా షూటింగ్ ఎండ్ అవుతుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం మరో 5 నెలల సమయం తీసుకొని అనుకున్న రిలీజ్ డేట్ 2020 జులై 30 నాటికి సినిమాను రిలీజ్ చేయవచ్చు. అయితే రీసెంట్ గా సెకెండ్ షెడ్యూల్ కోసం సెట్ చేసుకున్న సమయం మొత్తం వృధా అయ్యింది. 

రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ లు ఇద్దరు ఒకేసారి గాయాలపాలవ్వడంతో షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో సినిమా రిలీజ్ డేట్ పై టెన్షన్ మొదలైంది. రీసెంట్ గా ఎన్టీఆర్ తో మళ్ళీ షూటింగ్ ని పట్టాలెక్కించి జక్కన్న చరణ్ ని కూడా రేపో మాపో రప్పించనున్నాడు. ఇక నుంచి హీరోలిద్దరికి సెలవులు ఇవ్వకుండా పని చేయించాలని జక్కన్న కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

సినిమాను చెప్పిన సమయానికి రిలీజ్ చేయాలంటే క్యాన్సిల్ అయిన షెడ్యూల్ ని ఇప్పుడు కవర్ చేసి షూటింగ్ ని పూర్తి చేయాలనీ RRR టీమ్ ఆలోచిస్తోంది. మధ్యలో హీరోలకు సంబందించిన సీన్స్ లేకుంటే అప్పుడు హీరోలకు రెస్ట్ ఇచ్చే విధంగా రాజమౌళి టీమ్ ప్లాన్ చేసిందట. మరి దర్శకుడి కోసం స్టార్ హీరోలు ఏ స్థాయిలో కష్టపడతారలో చూడాలి.  

click me!