నిఖిల్ 'స్పై' నుంచి రొమాంటిక్ సాంగ్.. హాట్ గ్లామర్ తో రెచ్చిపోతున్న ఐశ్వర్య మీనన్

Published : Jun 11, 2023, 08:01 PM ISTUpdated : Jun 11, 2023, 08:04 PM IST
నిఖిల్ 'స్పై' నుంచి రొమాంటిక్ సాంగ్.. హాట్ గ్లామర్ తో రెచ్చిపోతున్న ఐశ్వర్య మీనన్

సారాంశం

ప్రస్తుతం నిఖిల్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీ హీరోగా మారిపోయారు. నిఖిల్ నుంచి తదుపరి రాబోతున్న చిత్రం స్పై.

మీడియం బడ్జెట్ చిత్రాలతో అలరించే యంగ్ హీరో నిఖిల్ 'కార్తికేయ 2' చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. కార్తికేయ 2 ఇండియా మొత్తం రీసౌండింగ్ బ్లాక్ బస్టర్ కావడంతో నిఖిల్ రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం నిఖిల్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీ హీరోగా మారిపోయారు. నిఖిల్ నుంచి తదుపరి రాబోతున్న చిత్రం స్పై. అలాగే నిఖిల్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మాణంలో 'ది ఇండియా హౌస్' అనే పాన్ ఇండియా చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలతో పాటు 'స్వయంభు' అనే పీరియాడిక్ వార్ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 

స్పై మూవీ నుంచి తాజాగా రొమాంటిక్ సాంగ్ విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్యారీ పిహెచ్ దర్శకత్వంలో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా స్పై తెరకెక్కుతోంది. ఈడి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె రాజశేఖర్ రెడ్డి నిర్మాతగా సుభాష్ చంద్రబోస్ సీక్రెట్ స్టోరీ, డెత్ మిస్టరీ ఆధారంగా ఉత్తరకెక్కుతున్న సినిమా నుంచి మొదటి పాట విడుదలైంది.

జూమ్ జూమ్ అంటూ సాగే ఈ పాట నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్ మధ్య వచ్చే లవ్ రొమాంటిక్ సాంగ్. అనురాగ్ కులకర్ణి, రమ్య బేహారా పాడిన ఈ పాటకు కిట్టు విస్సప్రగడ రచయితగా వ్యవహరించారు. సీతారమమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ మ్యూజికల్ ఆల్బమ్ ఇచ్చిన విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీత దర్శకులుగా పనిచేస్తున్నారు. అలాగే శ్రీ చరణ్ పాకాల స్పై సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తూటాలే పేలుస్తుంటే నీ చిరు నగవే, అందాల గాయం తగిలే నా ఎదకే వంటి లిరిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కమ్మని పదాలతో సాగే మెలోడీ సాంగ్ శ్రోతల మనసు దోచేసింది. ప్రస్తుతం ఈ పాట కుర్రకారు గుండెలను మీటుతూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. హీరోయిన్ గా నటిస్తున్న ఐశ్వర్య మీనన్ ఈ సాంగ్ లో తన గ్లామర్ ప్రదర్శించే ప్రయత్నం చేసింది. 

 

భారదేశ అత్యుత్తమమైన రహస్య కథను చరిత్రలో నిలిచిపోయే స్పై థ్రిల్లర్ చిత్రంగా స్పై చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, హిందీ, తమిళ్, మళయాళం,కన్నడ భాషల్లో జూన్ 29 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు ముస్తాబు అవుతుంది.

తారాగణం: నిఖిల్ సిద్ధార్థ్, ఆర్యన్ రాజేష్, ఐశ్వర్య మీనన్, సన్యా ఠాకూర్, అభినవ్ గోమటం, మకరంద్ దేశ్‌పాండే, జిషు సేన్ గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ, కృష్ణ తేజ, ప్రిషా సింగ్, సోనియా నరేష్  తదితరులు.

PREV
click me!

Recommended Stories

Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్