మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేసిన `విరాటపర్వం` టీజర్‌.. చూస్తే గూస్‌బమ్సే..

Published : Mar 18, 2021, 05:23 PM IST
మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేసిన `విరాటపర్వం` టీజర్‌.. చూస్తే గూస్‌బమ్సే..

సారాంశం

మెగా స్టార్‌ చిరంజీవి `విరాటపర్వం` చిత్ర టీజర్‌ని విడుదల చేశారు.  ఈ టీజర్‌ ఆద్యంతం భావోద్వేగ భరితంగా, ఉద్వేగభరితంగా సాగుతూ ఆకట్టుకుంటుంది. రోమాలు నిక్కబొరిచేలా ఉంది.

`ఆదిపత్య జాడలనే, చెరిపేయగా ఎన్నినాళ్లు..తారతమ్య గోడలనే..పెకిలించగా ఎన్నినాళ్లు..దున్నెటోడి వెన్ను విరిచి, భూస్వాములు ధనికులయిరీ..` అని ఉద్వేగంతో అంటున్నాడు రానా. అందుకు `ప్రియమైన అరణ్య నీ కవితకి నాలో తెలియని భావోద్వేగం రగులుతుంది.. ` అంటోంది సాయిపల్లవి. వీరిద్దరు `విరాటపర్వం`లో చెప్పిన మాటలు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ విడుదలైంది. మెగా స్టార్‌ చిరంజీవి `విరాటపర్వం` చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. ఇది రా అండ్‌ రియలిస్టిక్‌ చిత్రమని,గొప్ప కథని వేణు ఉడుగులు చెబుతున్నారని, చిత్ర బృందానికి ఆయన బెస్ట్ విషెస్‌ తెలియజేశారు. 

ఈ టీజర్‌ ఆద్యంతం భావోద్వేగ భరితంగా, ఉద్వేగభరితంగా సాగుతూ ఆకట్టుకుంటుంది. రోమాలు నిక్కబొరిచేలా ఉంది. ఇందులో రానా కవితలు చదివి ఇన్‌స్పైర్‌ అయి ఆయన బాటలో నడిచేందుకు వెళ్లిన వెన్నెల పాత్రలో సాయిపల్లవి కనిపించనుందని అర్థమవుతుంది. ఇందులో సాయిపల్లవిపై పోలీసులు అసభ్యంగా ప్రవర్తించడం, చివరకు ఆమె `దొంగ ల..  ది కొడకా` అంటే దుమ్మెత్తి పోయడం గూస్‌బమ్స్ క్రియేట్‌ చేస్తుంది. 

ఇందులో రానా కామ్రేడ్‌ రవన్నపాత్రలో నటిస్తున్నారు. రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా నటిస్తున్న  `విరాటపర్వం` చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్‌బాబు, సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్‌, ఫస్ట్ లుక్‌లు సినిమాపై అంచనాలను పెంచాయి. అలాగే `కోలు కోలు `పాట సైతం ఉర్రూతలూగించింది. ఇప్పుడు విడుదలైన టీజర్‌ ఉద్యమాన్ని, ప్రేమని ప్రతిబింబిస్తుంది. 

నక్సల్‌ రవన్న అలియాస్‌ డాక్టర్‌ రవిశంకర్‌ జీవితం ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు దర్శకుడు వేణు ఉడుగుల. నక్సల్‌ పోరాటం, విప్లవ భావాలు, కమ్యూనిస్టు ఉద్యమాలు 1990లో ఎలా ఉండేవి, తమకు, పేద ప్రజలకు జరిగిన అన్యాయాలపై రవన్న చేసిన పోరాటం ఉద్యమాన్ని ఇందులో చూపించబోతున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాని ఏప్రిల్‌ 30న విడుదల చేయబోతున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Pavala Syamala Struggles: పెళ్లైన మూడేళ్లకే భర్త మరణం, ఒంటరి చేసి పీడించిన సమాజం.. పావలా శ్యామల తెర వెనుక పోరాటం
Pavala Syamala Passed Away: సీనియర్‌ నటి పావలా శ్యామల ఇకలేరు.. దయనీయ స్థితిలో కన్నుమూత