ఏంటా.. ఫోజు? రకుల్ పై నెటిజన్ల విమర్శలు..!

By Udayavani DhuliFirst Published Oct 8, 2018, 11:05 AM IST
Highlights

ఈ మధ్య కాలంలో సినిమాలలో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంది రకుల్. టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంతో బాగా సైలెంట్ అయిపోయిన ఈ బ్యూటీ స్నేహితులు, ఫ్యామిలీతో సరదాగా గడుపుతోంది. ఇటీవల ఆమె మంచు లక్ష్మితో తీసుకున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ మధ్య కాలంలో సినిమాలలో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంది రకుల్. టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంతో బాగా సైలెంట్ అయిపోయిన ఈ బ్యూటీ స్నేహితులు, ఫ్యామిలీతో సరదాగా గడుపుతోంది. ఇటీవల ఆమె మంచు లక్ష్మితో తీసుకున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఫోటో చూసిన నెటిజన్లు రకుల్ ని బాగా ట్రోల్ చేస్తున్నారు. మంచు లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా ఆమెతో కలిసి నీరజ కోన, రకుల్ లు శ్రీలంక టూర్ కి వెళ్లారు. ఆ టూర్ లో రకుల్ ప్రీత్ సింగ్.. మంచు లక్ష్మిని ముద్దాడుతూ ఓ ఫోటో తీసుకుంది. ఆ ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

మంచు లక్ష్మిని వెనుక నుండి కౌగిలించుకొని రకుల్ ముద్దుపెట్టడాన్ని అభిమానులు ట్రోల్  చేస్తున్నారు. ఏంటా ఫోజు..? అంటూ రకుల్ పై మండిపడుతున్నారు. మరికొందరు  వీరిద్దరూ సుప్రీం కోర్టు తీర్పుని మరోసారి గుర్తుచేశారంటూ జోకులు పేలుస్తున్నారు.

ఇద్దరు మహిళలు ఇంత అసభ్యకరంగా ఫోటోలు ఎలా తీయించుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే రకుల్ కానీ మంచు లక్ష్మి కానీ ఈ ట్రోలింగ్ ని పెద్దగా పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం ఈ ఫోటోని తెగ షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.  

click me!