
హోరాహోరీగా జరిగిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత దిల్రాజు విజయం సాధించారు. అలాగే వైస్ ప్రెసిడెంట్గా నాగార్జున, ట్రెజరర్గా విజయేందర్ రెడ్డి, సెక్రటరీగా దామోదర వర ప్రసాద్ గెలిచినట్లుగా ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. అధ్యక్షుడిగా గెలవడానికి మేజిక్ ఫిగర్ 25 కాగా.. దిల్రాజుకు 31 ఓట్లు పోలయ్యాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ కీలక ఎన్నికల్లో మొత్తం 1567 మంది సభ్యుల ఓట్లలో దిల్ రాజుకు 563, సీ కల్యాణ్ కు 497 వచ్చాయి. ఈ క్రమంలో జరిగిన పోటీలో దిల్ రాజు గెలుపొందారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, డైరెక్టర్లు, స్టూడియో ఓనర్లతో సహా పరిశ్రమలోని వివిధ విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఎన్నికైన సభ్యులు 2023 నుంచి 2025 మధ్య కాలానికి సేవలందిస్తారు. ప్రొడ్యూసర్ సెక్టార్లోని మొత్తం 12 స్థానాల్లో ఏడింటిలో దిల్రాజు ప్యానల్ గెలుపొందింది.
డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లో రెండు ప్యానల్స్ నుంచి చెరో ఆరుగురు గెలుపును అందుకున్నారు. ఎగ్జిబిటర్స్ సెక్టార్లో ఏకగ్రీవంగా ఎన్నికైనవారు కూడా దిల్రాజుకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.స్టూడియో సెక్టార్లో గెలిచిన నలుగురిలో ముగ్గురు దిల్రాజు ప్యానల్ వారే కావడం విశేషం. నిర్మాతల విభాగంలో దిల్రాజు ప్యానెల్ నుంచి 12 మందిలో ఏడుగురు గెలుపొందారు. దిల్రాజు, దామోదర ప్రసాద్, మోహన్ వడ్లపాటి, స్రవంతి రవికిశోర్, పద్మిని, రవిశంకర్ యలమంచిలి, మోహన్గౌడ్లు నిర్మాతల విభాగంలో దిల్రాజు ప్యానెల్ నుంచి గెలిచారు. దీంతో ఫిల్మ్ ఛాంబర్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది..