స్పీడుగా లో కన్నప్పకు సంబంధించిన ఆయన భాగాన్ని కంప్లీట్ చేస్తున్నారట. ఇక ప్రభాస్ ఈ మూవీలో భాగమవ్వడంతో మంచి హైప్ వస్తుందని భావిస్తున్నారు.
మై బ్రదర్ కన్నప్ప సెట్లో జాయిన్ అయ్యారు అంటూ ప్రభాస్ గురించి అప్డేట్ ఇచ్చాడు విష్ణు మంచు. ఈ మేరకు ప్రభాస్ కనిపించకుండా జాగ్రత్త పడుతూ ఓ పోస్టర్ను రిలీజ్ మంచు విష్ణు చేశారు. ఇందులో ప్రభాస్ కాళ్లని మాత్రమే చూపించారు. ప్రభాస్ ఈ సినిమా ఏ రోల్లో కనిపిస్తాడని ఇప్పటికే ఆసక్తి పెరిగిపోయిన సంగతి తెలిసిందే. కొందరేమో ప్రభాస్ శివుడిలా కనిపిస్తాడని అంటున్నారు. ఇంకొందరేమో అక్షయ్ కుమార్ శివుడి పాత్రని పోషించాడని చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ ఏ పాత్రలో కనిపించబోతున్నాడనేది ఆసక్తికరమైన విషయం.
అంజతున్న సమాచారం మేరకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్నారు. ఈ మూవీలో ఆయన శివుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. దాంతో శివుడి పాత్రలో ముందు ప్రభాస్ నటిస్తారని వార్తలు నిజం కాదనే తెలియలేదు. అయితే టీమ్ ఆ విషయంలో ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ మూవీలో ప్రభాస్.. శివ భక్తుడు అయిన నందీశ్వరుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన కన్నప్ప సెట్స్ లోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని మేకర్స్ అనౌన్స్ చేశారు. స్పెషల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. అయితే పోస్టర్ లో ప్రభాస్ ముఖాన్ని రివీల్ చేయలేదు. కాళ్లను మాత్రమే చూపించారు. ఇప్పుడు ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది
My brother joined the shoot 🏹 pic.twitter.com/WW8WQbBLec
— Vishnu Manchu (@iVishnuManchu)ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. కన్నప్ప సినిమా కోసం మూడు రోజులే డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మేకర్స్ స్పీడుగా లో కన్నప్పకు సంబంధించిన ఆయన భాగాన్ని కంప్లీట్ చేస్తున్నారట. ఇక ప్రభాస్ ఈ మూవీలో భాగమవ్వడంతో మంచి హైప్ వస్తుందని భావిస్తున్నారు. దీన్ని బట్టి ఈ చిత్రంలో నందీశ్వరుడి రోల్ కు మంచి ఇంపాక్ట్ కూడా ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ప్రభాస్.. నందీశ్వరుడిగా ఎలా ఉంటారో వేచి చూడాలి.
ఈ క్రమంలో ఆఖరిగా నందీశ్వరుడిగా కనిపించడానికి ఒప్పుకొన్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. శివుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కనిపించనున్నాడు. మరో ప్రక్క అనుష్క సైతం ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తోంది. ఆమె పార్వతిదేవి పాత్రలో కనిపిస్తుందని చెప్పుకుంటున్నారు. అయితే అందులో ఏ మేరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
కన్నప్ప సినిమాకు మహాభారత టీవీ సీరియల్ ఫేమ్ ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో అంచనాలు మరింత తారాస్థాయికి చేరిపోయాయి.మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి సంయుక్తంగా కన్నప్ప సినిమాను నిర్మిస్తున్నారు. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ షూటింగ్ మొత్తం న్యూజిలాండ్లో చిత్రీకరించనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. సినిమాలో ముందుగా హీరోయిన్గా అనుకున్న నుపుర్ సనన్ షెడ్యూల్స్ కారణంగా తప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మహా శివరాత్రి సందర్భంగా కన్నప్ప ఫస్ట్ లుక్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.
మరోవైపు ప్రభాస్.. కల్కి, కన్నప్పలతో పాటు మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్', సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' మూవీలతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడిక్ వార్ డ్రామాలో నటిస్తున్నాడు. అటు సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో భారీ యాక్షన్ చిత్రం చేయనున్నాడు.