ఇండియాలోనే భారీ క్రేజ్ కలిగిన ఇద్దరు స్టార్స్ ప్రభాస్, యష్ ఒకే వేడుకలో కలిసి కనిపించడం ప్రత్యేకత సంతరించుకుంది. ఈ ఇద్దరు స్టార్స్ కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. ప్రభాస్, యష్ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో విడుదల కాగా వైరల్ అవుతున్నాయి.
కెజిఎఫ్ తో దేశం మొత్తం తన వైపు తిరిగి చూసేలా చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్, మరో భారీ ప్రాజెక్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ అనే టైటిల్ తో మూవీ తెరకెక్కించనున్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలలో నేడు ప్రారంభమైంది. హైదరాబాద్ లో ప్రముఖుల మధ్య నేటి ఉదయం 11:00 గంటకు సలార్ లాంఛింగ్ ప్రోగ్రాం మొదలైంది. కాగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కెజిఎఫ్ స్టార్ యష్ వచ్చారు.
సలార్ లాంఛింగ్ వేడుకకు యష్ రానున్నట్లు నిన్ననే సమాచారం అందింది. ఇండియాలోనే భారీ క్రేజ్ కలిగిన ఇద్దరు స్టార్స్ ప్రభాస్, యష్ ఒకే వేడుకలో కలిసి కనిపించడం ప్రత్యేకత సంతరించుకుంది. ఈ ఇద్దరు స్టార్స్ కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. ప్రభాస్, యష్ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో విడుదల కాగా వైరల్ అవుతున్నాయి.
ఇక ప్రభాస్ గతంలో ప్రకటించిన నాగ్ అశ్విన్, ఆది పురుష్ చిత్రాలకంటే ముందు సలార్ పూర్తి చేయనున్నారు. సలార్ మూవీ స్క్రిప్ట్ పక్కాగా సిద్ధం చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్, మూవీ నెలల వ్యవధిలో పూర్తి చేయనున్నాడని సమాచారం. కెజిఎఫ్ నిర్మాతలైన హోమబుల్ ఫిలిమ్స్ సలార్ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ మూవీలో నటించే హీరోయిన్, ఇతర నటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.