నువ్వు పెద్ద డైరెక్టర్ అయినంత మాత్రాన కాళ్ళ మధ్యలో వెళ్లాలా.. పోసాని!

By Prashanth MFirst Published May 11, 2019, 2:22 PM IST
Highlights

వివాదాలకు, సంచలన కామెంట్లకు కేంద్రబిందువు పోసాని కృష్ణ మురళి. ముక్కుసూటిగా వ్యవహరించే తత్వంతో పోసాని తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా పోసాని ఓ ఇంటర్వ్యూలో దాసరి నారాయణరావుతో జరిగిన వివాదాన్ని గుర్తు చేసుకున్నారు.

వివాదాలకు, సంచలన కామెంట్లకు కేంద్రబిందువు పోసాని కృష్ణ మురళి. ముక్కుసూటిగా వ్యవహరించే తత్వంతో పోసాని తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా పోసాని ఓ ఇంటర్వ్యూలో దాసరి నారాయణరావుతో జరిగిన వివాదాన్ని గుర్తు చేసుకున్నారు. దాసరి కుమారుడు అరుణ్ కుమార్ తొలి చిత్రం విషయంలో తమ మధ్య గొడవ జరిగిందని పోసాని పేర్కొన్నారు. 

అరుణ్ కుమార్ కోసం దాసరి ఓ కథ రాయమని అడిగారు. పూర్తి కథ సిద్ధం చేసి దాసరి వద్దకు వెళ్ళా. గురువుగారు బయట అయితే సినిమాకు 12 లక్షలు తీసుకుంటా.. మీరు కాబట్టి 6 లక్షలు ఇవ్వండి చాలు అని అడిగా. వెంటనే లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. మిగిలిన డబ్బు మేనేజర్ దగ్గర తీసుకోమన్నారు. చుట్టూ తిప్పుకుంటున్నారు కానీ డబ్బు మాత్రం ఇవ్వడంలేదు. దీనితో దాసరి వైఖరి పట్ల కోపం వచ్చిందని పోసాని తెలిపారు. 

ఒకరోజు దాసరి ఇంటికి వెళ్లి డబ్బైనా ఇవ్వండి లేకుంటే నా స్క్రిప్ట్ నాకు ఇచ్చేయండి అని గట్టిగా అడిగా. మరుసటి రోజే కొత్త కథ, కథనాలతో గ్రీకువీరుడు అని వార్తవచ్చింది. అలా దాసరి కుమారుడి చిత్రం నుంచి తాను తప్పుకున్నానని పోసాని తెలిపారు. నేను ఎవరితో అయినా ఒకేరకంగా మాట్లాడుతా. పెద్ద డైరెక్టర్ అయితే నాకు ఏంటి.. వాళ్ళ కాళ్ళ మధ్యలో వెళ్ళాలా.. తన వ్యవహార శైలి ఇదేనని పోసాని అన్నారు. 

 

click me!