Poonam Pandey: మామిడి పండుతో అసభ్యంగా.. నడిరోడ్డులో పూనమ్ పాండే వల్గర్ బిహేవియర్

By team teluguFirst Published May 18, 2022, 4:25 PM IST
Highlights

నటి పూనమ్ పాండే పేరు వినగానే ఎక్కువగా వివాదాలే గుర్తుకు వస్తాయి. బోల్డ్ కు బ్రాండ్ అంబాసిడర్ ఆమె. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత నటిగా మారింది. 

నటి పూనమ్ పాండే పేరు వినగానే ఎక్కువగా వివాదాలే గుర్తుకు వస్తాయి. బోల్డ్ కు బ్రాండ్ అంబాసిడర్ ఆమె. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత నటిగా మారింది. ఆ మధ్యన అశ్లీల చిత్రాలతో రచ్చ చేసింది. ఎవరేమనుకున్నా నా పంథా ఇంతే అంటూ బోల్డ్ గా అశ్లీల చిత్రాల్లో నటించింది. దీని కోసం పూనమ్ పాండే సొంతంగా ఓ యాప్ ని లాంచ్ చేసుకున్న సంగతి తెలిసిందే. 

ఇటీవల పూనమ్ పాండే కంగనా రనౌత్ హోస్ట్ గా చేసిన లాక్ అప్ షోలో పాల్గొంది. అశ్లీల చిత్రాల్లో నటించడం, బోల్డ్ గా కామెంట్స్ చేయడంతో పూనమ్ పాండేపై దారుణంగా ట్రోలింగ్ జరిగింది. కానీ పూనమ్ అవేమీ పట్టించుకోలేదు. తనకు అవకాశాలు లేకపోవడం వల్లే అలాంటి వీడియోలు చేయాల్సి వచ్చింది అని పూనమ్ పాండే ఇటీవల తెలిపింది. 

ఇదిలా ఉండగా పూనమ్ పాండే చీప్ పబ్లిసిటీ పిచ్చి మాత్రం ఇంకాపోలేదని నెటిజన్లు ట్రోలింగ్ కి దిగారు. నడిరోడ్డులో ఓ మామిడి పండ్ల షాప్ వద్ద ఆమె చేసిన పనే అందుకు కారణం. ఇటీవల పూనమ్ పాండే ముంబై లో రోడ్డు పక్కన ఉన్న మామిడి పండ్ల షాప్ కి వెళ్ళింది.దీనితో జనాలు, మీడియా కెమెరాలు పట్టుకుని ఆమెని చుట్టుముట్టారు. 

ఓ మామిడి పండుని తీసుకున్న పూనమ్ దానిని అసభ్యంగా నాకుతున్నట్లు ఫోజులు ఇచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలు మార్లు ఆ మామిడి పండుని నాకుతున్నట్లు ప్రవర్తించింది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 

పూనమ్ పాండే పబ్లిసిటీ కోసం ఎంతకైనా దిగజారుతుంది అని కామెంట్స్ పెడుతున్నారు. చీప్ గా వల్గర్ గా బిహేవ్ చేస్తోంది అని కామెంట్స్ పెడుతున్నారు. నడిరోడ్డులో ఇలాంటి పనులు అవసరమా అని అంటున్నారు. ఇలా ప్రవర్తించడం పూనమ్ పాండేకి కొత్తేమీ కాదు. 

లాక్ అప్ షోలో తనని నామినేషన్స్ నుంచి సేవ్ చేసుకోవడం కోసం పూనమ్ పాండే కెమెరా ముందు టాప్ తీసేసి ఫోజులు ఇచ్చింది. తనని సేవ్ చేసిన ఫ్యాన్స్ కోసమే అని చెప్పింది.   

 

click me!