ఫ్యాన్స్ ని పాటతో ఖుషీ చేయబోతున్న పవన్‌.. సూపర్‌స్టార్‌కి అభినందనలు

Published : Mar 24, 2021, 09:23 AM IST
ఫ్యాన్స్ ని పాటతో ఖుషీ చేయబోతున్న పవన్‌.. సూపర్‌స్టార్‌కి అభినందనలు

సారాంశం

మలయాళ చిత్రం `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌లో నటిస్తున్నారు. ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో మరో హీరోగా రానా నటిస్తున్నారు. ఈ సినిమాకి థమన్‌ సంగీతం అందిస్తున్నారు. సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోనే పవన్‌ ఓ పాట పాడబోతున్నాడట. 

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ ని మరోసారి అలరించబోతున్నాడు. అంటే నటనతో కాదు. పాటతో అభిమానులను ఉర్రూతలూగించబోతున్నారట. మరోసారి ఆయన తన సినిమాలో పాటపాడబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పవన్‌ నటించిన `వకీల్‌సాబ్‌` చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ఇది ఏప్రిల్‌ 9న విడుదల కానుంది. దీంతోపాటు మలయాళ చిత్రం `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌లో నటిస్తున్నారు. ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో మరో హీరోగా రానా నటిస్తున్నారు. ఈ సినిమాకి థమన్‌ సంగీతం అందిస్తున్నారు. సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ చిత్రంలోనే పవన్‌ ఓ పాట పాడబోతున్నాడట. `వకీల్‌సాబ్‌` ప్రమోషన్‌ ఈవెంట్‌లో మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ వెల్లడించారు. తన అభిమానులను పాటతో మరోసారి ఉర్రూతలూగించాలని పవన్‌ భావిస్తున్నారు. ఇప్పటికే పవన్‌ `ఖుషీ`, `జానీ`, `గుడుంబా శంకర్‌`, `అత్తారింటికి దారేదీ`, `అజ్ఞాతవాసి` చిత్రాల్లో పాటలు పాడారు. అవి ఫ్యాన్స్ ని ఎంతగానే అలరించాయి. దీంతో `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌లోనూ పాటతో అభిమానులను ఎంటర్‌టైన్‌ చేయాలని పవన్‌ నిర్ణయించుకున్నారట. ఇదిలా ఉంటే ఇందులో ఆయనకు జోడిగా ఇంకా హీరోయిన్‌ ఫిక్స్ కాలేదు. రానాకి ఐశ్వర్య రాజేష్‌ పేరు వినిపిస్తుంది. పవన్‌ సరసన నటించే హీరోయిన్‌ ఎవరనేది ఇంకా నిర్ణయించలేదట. అసలు హీరోయిన్‌ ఉంటుందా లేదా అన్నసందేశాలు కూడా వినిపిస్తున్నాయి. 

ఇదిలా ఉంటే ఇటీవల 67వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలకు పవన్‌ అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా మహేష్‌ నటించిన `మహర్షి` చిత్రానికి, మహేష్‌కి ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అలాగే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో వచ్చిన `జెర్సీ` చిత్రం కూడా రెండు జాతీయఅవార్డులు దక్కించుకుంది. దీంతో `జెర్సీ` సినిమాకి కూడా ఆయన అభినందనలు తెలిపారు. జాతీయ అవార్డులు ఇచ్చిన స్ఫూర్తితో వీరి మరింత మంచి సినిమాలు చేయాలన్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు