పవన్ కళ్యాణ్ తన బ్యానర్ పై ప్రొడ్యూస్ చేస్తారట

Published : Apr 25, 2019, 10:41 AM IST
పవన్ కళ్యాణ్ తన బ్యానర్ పై ప్రొడ్యూస్ చేస్తారట

సారాంశం

వరస పెట్టి వచ్చిన ప్లాఫ్ ల తర్వాత మెగా మేనల్లుడు సాయి తేజ చిత్రలహరి చిత్రంతో రీజనబుల్ హిట్ ని కొట్టాడు.

వరస పెట్టి వచ్చిన ప్లాఫ్ ల తర్వాత మెగా మేనల్లుడు సాయి తేజ చిత్రలహరి చిత్రంతో రీజనబుల్ హిట్ ని కొట్టాడు. మైత్రీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం పెద్ద హిట్ కాకపోయినా సాయికి  కాస్త ఊపిరిపీల్చుకునే అవకాసం ఇచ్చింది. దాంతో మారుతి తో చేయబోయే చిత్రానికి ఉత్సాహంగా సిక్స్ ప్యాక్ తో  ప్రిపేర్ అవుతున్నాడు సాయి. ఈ నేపధ్యంలో తన మేనల్లుడు మరింత ఉత్సాహాన్ని ఇవ్వటానికి పవన్ పూనుకున్నారు. ఆయన సాయితో ఓ చిత్రం నిర్మించబోతున్నట్లు సమాచారం.

తన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై సాయితో ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పవన్ క్లోజ్ అసోశియేట్స్ లో ఒకరు దీన్ని డైరక్ట్ చేయనున్నారు. ఇంతకు ముందు నితిన్ హీరోగా ఛల్ మోహన్ రంగా అనే చిత్రాన్ని నిర్మించారు ఇదే బ్యానర్ . ఆ తర్వాత చేస్తున్న చిత్రం ఇదే. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం.

అలాగే ఈ చిత్రం కోసం ప్రత్యేకమైన యాక్షన్ సీక్వెన్స్ లు రూపొందించాలని ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. సాయిని డిఫరెంట్ ప్రెజెంట్ చూసి యూత్ లోకు పంపాలనేది పవన్ ఆలోచన అంటున్నారు. ఈ సినిమా కోసం అవసరమనుకుంటే కొద్ది రోజులు యాక్షన్ ఎపిసోడ్స్ కు చెందిన ట్రెనింగ్ ఇప్పించాలన్నట్లు వినికిడి. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?